Hyderabad: హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఖైతలాపూర్లో నివాసముంటున్న రహీం, సుమేరా దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. బుధవారం ఈ గొడవలు కాస్తా ముదిరి తీవ్ర రూపం దాల్చాయి. తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త రహీం.. తన భార్య సుమేరాను దారుణంగా హత్య చేశాడు.
వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రహీం, భార్యను చంపిన తర్వాత తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన భార్యను తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Also Read: ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మహిళపై అత్యాచారం
భార్యను చంపిన భర్త..
HYD కూకట్ పల్లి ఖైతలాపూర్లోని నివాసం ఉంటున్న రహీం, సుమేరా దంపతులు
కుటుంబ కలహాలతో భార్య సుమేరాను చంపిన రహీం
భార్యను చంపి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త రహీం
ఆటో డ్రైవర్ పనిచేస్తున్న రహీం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోస్టుమార్టం… pic.twitter.com/byPqta1JH2
— BIG TV Breaking News (@bigtvtelugu) June 4, 2026