Road Accident: నేడు వార్త పత్రిక తిరగేసినా.. టీవీ ఛానెల్ పెట్టినా ఎక్కడో ఒకచోట జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒక మరణవార్త మరిచిపోకముందే మరో వార్త వినాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. రోడ్డుపై రక్తం మరక ఆరకముందే.. మరో ప్రాణం గాలిలో కలిసిపోతుంది. అటువంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెహిదీపట్నంలో ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోలిచౌకి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై.. జెప్టో సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న 25 ఏళ్ల అభిషేక్ తన టూవీలర్పై విధుల్లో బాగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు వాహన నియంత్రణ కోల్పోయి రోడ్డుపై కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుండి వేగంగా వస్తున్న గణేష్ ట్రావెల్స్కు చెందిన బస్సు.. అభిషేక్పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిని ప్రాంతంలో ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేసి.. వాహనాలను మళ్లించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అభిషేక్ మృతి చెందిన సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యవ వయసులో కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కుమారుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం వారి గుండెలను పిండేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి పైనుంచి వెళ్లిన ట్రావెల్ బస్సు.. సీసీటీవీ ఫుటేజ్
హైదరాబాద్-మెహదీపట్నం సమీపంలో ఘటన
టోలిచౌకి-మెహదీపట్నం రోడ్డులో అదుపు తప్పిన టూవీలర్
ప్రమాదంలో జెప్టో డెలివరీ బాయ్ అభిషేక్(25) దుర్మరణం
కింద పడిపోయిన యువకుడి పైనుంచి వెళ్లిన ట్రావెల్ బస్సు
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే… pic.twitter.com/K5bkv7RPWm
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2026