బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మియాపూర్‌లో విషాదం.. చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళ

మియాపూర్‌లో విషాదం.. చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళ

Hyderabad: హైదరాబాద్‌లో గుండెల్ని పిండేసే తీవ్ర విషాదకర ఘటన వెలుగుచూసింది. మియాపూర్ పరిధిలోని మయూరి నగర్‌లో నివసిస్తున్న ఈషా సాహు (37) అనే మహిళ.. తన ఆరు నెలల పసికందుతో కలిసి అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ చిన్నారి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. వెంటనే గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు పసిబిడ్డను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈషా సాహుకు రెండో బిడ్డ పుట్టిన తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడికి (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు) లోనైనట్లు తెలుస్తోంది. రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఎదురైన మానసిక సవాళ్లను తట్టుకోలేక, తీవ్ర వేదనతోనే ఆమె ఈ అనాలోచిత నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మానసిక ఒత్తిడి ఒక మనిషిని ఎంతటి దారుణమైన స్థితికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. పచ్చని సంసారంలో ఇలాంటి విషాదం నిండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read: భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్‌ను చంపి సిమెంట్ పైపులో దాచేసిన యజమాని!

Related News

భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్‌ను చంపి సిమెంట్ పైపులో దాచేసిన యజమాని!

మేడ్చల్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్!

మైనర్ బాలికపై అత్యాచారం.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

Road Accident: నుజ్జైన కారు ముందు పార్టు, స్పాట్‌లో ఇద్దరు మృతి, జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సహజీవనం చిచ్చుపెట్టింది.. ప్రియుడి మాటల్లో పడి.. ఐదేళ్ల కూతుర్ని చంపేసింది, చివర్లో ట్విస్ట్ ఏంటంటే..

క్యూనెట్ నయా మోసం.. ఇగ్నైట్ పేరుతో రూ.5 వేల కోట్లకు స్కెచ్.. 18 రోజుల్లోనే క్లోజ్!

హైదరాబాద్‌లో ఘోరం.. ఫోన్ అతిగా వాడుతోందని.. భార్య తలలోకి బుల్లెట్లు దించాడు!

×