BigTV English
Advertisement

PhD Student Suicide : డబ్బులు కోసం ఓ కానిస్టేబుల్ వేధింపులు.. ఉరేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్య

PhD Student Suicide : డబ్బులు కోసం ఓ కానిస్టేబుల్ వేధింపులు.. ఉరేసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్య

PhD Student Suicide : కుటుంబానికి దూరంగా ఉంటున్న తండ్రి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలంటూ ఓ కానిస్టేబుల్, అతని భార్య చేస్తున్న ఒత్తిడి భరించలేక ఓ పీహెచ్ డీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. తనకు సంబంధం లేని విషయంలో ఛీటింగ్ కేసు పెట్టి వేధిస్తుండడంతో తీవ్ర మనోవేధనకు గురై, చున్నీతో ఉరేసుకుని దీప్తి అనే యువతి చనిపోయింది. ఆత్మహత్యకు ముందు ఆమె సెల్ఫీ వీడియో బయటకు రావడంతో.. సంచలనంగా మారింది.


హైదరాబాద్ లోని నాచారం బాపూజీనగర్ సరస్వతీ కాలనీకి చెందిన పులివర్తి దీప్తి (28).. హబ్సీగూడలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – (ఐఐసీటీ) లో ప్రాజెక్టు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి సంగీత రావు కూడా గతంలో ఇదే సంస్ధలో పనిచేశారు. ప్రస్తుతం రిటైర్డ్ మెంట్ అయ్యారు. కానీ.. కుటుంబానికి చాన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం దీప్తి, ఆమె తల్లి మాత్రమే ఉంటున్నారు. మంచి చదువుతో కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కుమార్తెకు తండ్రి గతంలో చెేసిన అప్పు శాపంగా మారింది.

సంగీతరావు ఐఐసీటీలో పనిచేస్తున్నప్పుడు బెల్లా అనిల్ అనే ఓ కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. దాంతో.. అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మంచి.. అనిల్ దగ్గర సంగీతరావు రూ.15 లక్షల రూపాయాలు తీసుకున్నారు. కానీ చాన్నాళ్లుగా ఉద్యోగం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో.. అనిల్, అతని భార్య అనిత.. తరచు డబ్బుల కోసం దీప్తిని ఇబ్బంది పెడుతున్నారు. అనేక సార్లు ఆమెను తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి  తెచ్చారు.


అనిల్ అడిగిన ప్రతీసారి తన తండ్రి తమతో  ఉండడం లేదని, తనకు ఆ డబ్బులు కట్టే స్తోమత లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. డబ్బులు ఇవ్వాల్సిందే అని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే నాచారం ఠాణాలో అనిల్ తన భార్య అనితతో ఫిర్యాదు చేయించాడు. దీప్తి, ఆమె తండ్రి సంగీతరావు లపై ఛీటింగ్ కేసు నమోదైంది. మరోవైపు కోర్టులో సివిల్ దావా సైతం వేశారు. దీంతో.. సంబంధం లేని విషయంలో తనను ఇరికించారని ఆవేదన చెందిన దీప్తి.. మనస్థాపానికి గురైంది. దీంతో.. బుధవారం రాత్రి 10 గంటలకు తన గదిలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

దీప్తి తల్లి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. విషయాన్ని పోలీసులకు చేరవేయగా.. వారు ఆమె ఫోన్ తనిఖీ చేయగా.. ఓ సెల్ఫీ వీడియో ఉంది. అందులోని విషయం ఆధారంగా.. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు.

సెల్పీ వీడియోలో దీప్తి ఏమన్నది

సెల్పీ వీడియోలో దీప్తి తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన మరణానికి అనిల్, అతని భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణమని వెల్లడించింది. తన తండ్రి డబ్బు తీసుకుంటే తన మీద కేసు పెట్టి, జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఆ కేసుల మీద పోరాడే శక్తి లేదని, తన మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ కన్నీరు పెట్టింది. తన చావుకు కారణమైన వాళ్లకు శిక్షపడాలని కోరుకున్న దీప్తి.. చావులోనూ మానవత్వాన్ని చాటుకుంది. తన మృతదేహానికి కాల్చేయవద్దని, వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని కోరుకుంది.

 Also Read : ఓ అవ్వా తాతల కన్నీటి గాథ.. జీవితాంతం పడిన కష్టం క్షణాల్లో అగ్నికి ఆహుతైంది..

ఈ వీడియో ఆధారంగా దీప్తి తల్లి పోలీసు ఫిర్యాదు చేయడంతో..  పోలీసులు కేసు నమోదు చేసి దీప్తి మృతికి కారణమైన వాళ్లపై కేసులు పెట్టిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Related News

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Big Stories

×