E-Paper
Advertisement

Khairatabad Dog Attack: వీధి కుక్కల వేట.. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు.. ఖైరతాబాద్‌లో కలకలం

Khairatabad Dog Attack: వీధి కుక్కల వేట.. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు..  ఖైరతాబాద్‌లో కలకలం

Khairatabad Dog Attack: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల స్వైరవిహారం మరోసారి కలకలం రేపింది. ఖైరతాబాద్‌ పరిధిలో జరిగిన ఓ తాజా ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడటం నగరంలో కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.

ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన శార్వి అనే చిన్నారి స్థానిక పాఠశాలలో యూకేజీ (UKG) చదువుతోంది. ఎప్పటిలాగే తన ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో.. అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి తప్పించుకునే లోపే కుక్కలు ఆమె ముఖంపై తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను అక్కడి నుంచి తరిమికొట్టారు.

తీవ్ర రక్తస్రావంతో ఉన్న శార్విని తక్షణమే బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖంపై లోతైన గాయాలు కావడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరవాసులు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ.. వీధి కుక్కల నియంత్రణలో యంత్రాంగం విఫలమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.

ALSO READ: అయ్యో! ఎంత పని చేశావు చిన్నా.. ఆడుకుంటూ వెళ్ళి బావిలో పడి..

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×