7 Year Old Boy Murder: ఏడేళ్ల బాలుడి పై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్లో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారేశారు. అక్కడి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మృతిచెందిన బాలుడి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అసలు బాలుడు ఎవరు? ఆ బాలుడిని ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also read: ‘మనీ హీస్ట్’ చూసి బ్యాంకుకు కన్నం, ఏకంగా 17 కిలోల బంగారం కొట్టేసి..
హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బాలుడి కుటుంబ సభ్యలే ఎవరైనా చేశారా లేక అఘంతకుల ఈ దారుణానికి పాల్పడ్డారా అనే దాని పై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన దుండగులు
హైదరాబాద్ అత్తాపూర్ పీఎస్ పరిధిలోని గోల్డెన్ సిటీలో దారుణ ఘటన
బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేసి మీరాలం ట్యాంక్ సమీపంలో పడేసిన దుండగులు
బాలుడి వివరాలను సేకరిస్తున్న పోలీసులు
మిస్సింగ్ కేసుల వివరాలపై పోలీసుల ఆరా pic.twitter.com/vdzS2hxrUg
— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2025