E-Paper
Advertisement

హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!

హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ చేతివాటం ప్రదర్శించింది. గచ్చిబౌలిలోని ప్రముఖ హిల్ రిడ్జ్ విల్లాస్‌లో నివసించే ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు ఒక కేజీ బంగారు ఆభరణాలు, కోట్లాది రూపాయల విలువైన వజ్రాలను దొంగలు దోచుకెళ్లారు.

ఈ దారుణానికి ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్ దంపతులే ఒడిగట్టినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. కేవలం నెల రోజుల క్రితమే సదరు వ్యాపారి వీరికి ఆశ్రయమిచ్చి పనిలో పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వ్యాపారి తన కుటుంబంతో కలిసి ఒక శుభకార్యం నిమిత్తం ముంబయి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ దంపతులు ఇల్లంతా గుల్ల చేసి పరారయ్యారు.

బాధితులు ముంబయి నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నమ్మినవారే ఇలా ముంచేయడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read: ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!

Crime News: రూపాయలు 110.. ఒక పాత ఫోన్.. ఈ నయా లూటీ కోసం మర్డర్ ప్లాన్ చేసిన డెలివరీ బాయ్స్!

యూట్యూబర్‌ని బోల్తా కొట్టించిన దొంగలు, బంగారం-డబ్బు దోచుకెళ్లారు? అదెలా సాధ్యం

విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!

గేమ్స్ ఆడొద్దన్నందుకు.. కన్నవారిపైనే కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు!

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Big Stories

×