E-Paper
Advertisement

షామీర్‌పేట్‌లో నిషేధిత BT-3 విత్తనాల దందా కలకం

షామీర్‌పేట్‌లో నిషేధిత BT-3 విత్తనాల దందా కలకం
Advertisement

BT-3 Seeds: స్వేచ్ఛ బ్యూరో: నిషేధిత BT-3 పత్తి విత్తనాల అక్రమ రవాణాపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. షామీర్‌పేట్ ORR ఎగ్జిట్ నంబర్-07 సమీపంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 100 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా చెబ్రోలు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసరావు(58) అక్రమంగా BT-3 పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

పరారీలో దాసరి సూరిబాబు..

దీంతో ఎస్‌వోటీ కంటోన్మెంట్ బృందం, షామీర్‌పేట్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిందితుడి వద్ద రెండు సంచుల్లో మొత్తం 100 కిలోల నిషేధిత విత్తనాలు గుర్తించారు. ఒక్కో సంచిలో 50 కిలోల చొప్పున విత్తనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో పరారీలో ఉన్న దాసరి సూరిబాబు, అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మరో శ్రీనివాసరావుతో కలిసి తక్కువ ధరలకు విత్తనాలు కొనుగోలు చేసి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రైతులు, ఎరువుల దుకాణాలకు అధిక ధరలకు విక్రయించేందుకు యత్నించినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Also Read: వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మీరు చేసే ఈ చిన్న తప్పు.. బట్టలను పనికిరాకుండా చేస్తున్నాయ్!

ఇదే తరహా కేసు నమోదు..  

ఇప్పటికే దాసరి శ్రీనివాసరావుపై వికారాబాద్ జిల్లా యాలాల్ పోలీస్‌స్టేషన్‌లో ఇదే తరహా కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు. నిషేధిత, నకిలీ విత్తనాల వినియోగంతో భూమి కాలుష్యం, పంట నష్టాలు, రైతులకు భారీ ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×