Jangaon: జనగామ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికులు సమాచారం ప్రకారం.. హన్మకొండకు చెందిన అసద్, హబీబ్ మరికొంతమంది స్నేహితులతో కలిసి కర్ణాటకలోని గుల్బార్గాకు వెళ్లారు. అక్కడ దర్గాను దర్శించుకుని తిరిగి తమ సొంత ఊరైన హన్మకొండకు ఎర్టిగా కారులో వస్తున్నారు. ఈ క్రమంలోనే గోవర్ధనగిరి దర్గా సమీపానికి రాగానే ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును చాలా బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ఎంత వేగంగా జరిగిందంటే.. కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నలిగిపోయింది. సీట్లలో కూర్చున్న అసద్, హబీబ్ ఇద్దరూ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారులో ఉన్న మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగున వచ్చి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ కుంభకోణం.. 15 మంది అధికారులు సస్పెండ్!
ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్మకొండకు చెందిన అసద్, హబీబ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుల్బార్గా నుండి హన్మకొండకు… pic.twitter.com/PCnITqinoN
— BIG TV Breaking News (@bigtvtelugu) June 13, 2026