BigTV English

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Karnataka Crime: కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా ఇప్పుడు ఒక భయంకరమైన హత్య కేసుతో కుదిపేసింది. బెల్లవి గ్రామానికి చెందిన 42 ఏళ్ల లక్ష్మీదేవి ఆగస్టు 3న తన కూతురిని చూడటానికి ఇంటి నుంచి బయలుదేరింది. ఆ తరువాత ఆమె తిరిగి ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఆమె భర్త బసవరాజ్ బెల్లవి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ ఫిర్యాదు ఇచ్చిన మూడు రోజుల తరువాత, ఆగస్టు 7న, చింపుగనహಳ್ಳಿ పరిసరాల్లో ప్రజలను భయానక సంఘటన వెలుగుచూసింది.


ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో మొత్తం 19 సంచులు కనిపించాయి. ఆ సంచుల్లో మానవ శరీర భాగాలు ఉండటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఒక్కొక్క సంచిని పరిశీలించగా అవన్నీ ఒకే వ్యక్తి శరీర భాగాలేనని తేలింది. వెంటనే కోరటగెరె పోలీస్ మర్డర్ కేసు నమోదు చేసి, జిల్లా వ్యాప్తంగా ఉన్న మిస్సింగ్ ఫిర్యాదుల జాబితాను సేకరించారు.

ఈ సమయంలో బెల్లవి పోలీస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బసవరాజ్‌ను పిలిచి శరీర భాగాలను గుర్తించమని చెప్పారు. బసవరాజ్ వాటిని తన భార్య లక్ష్మీదేవివేనని నిర్ధారించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించగా, ఒక మారుతి సుజుకి బ్రెజ్జా కారులో ఈ సంచులను తీసుకెళ్తున్న దృశ్యాలు లభించాయి. ఆ కారు సతీష్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయి ఉంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను ఈ హత్య వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాడు.


సతీష్ ఇచ్చిన సమాచారం ప్రకారం..

ఈ ఘోరానికి సూత్రధారి లక్ష్మీదేవి అల్లుడు, 47 ఏళ్ల దంతవైద్యుడు డాక్టర్ రామచంద్రయ్య. ఇతను లక్ష్మీదేవి కూతురు తేజస్విని 2019లో వివాహం చేసుకున్నాడు. కానీ ఈ వివాహానికి ముందే అతని మొదటి పెళ్లి విడాకుల దశలోనే ఉంది. రామచంద్రయ్య తన భార్య తేజస్వి తరచూ తల్లి సలహాలను వినడం వల్ల తమ దాంపత్య జీవితం క్షీణించిందని భావించాడు. అత్త జోక్యం వల్ల సమస్యలు పెరుగుతున్నాయనే కోపంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ పనిలో తన దగ్గరికి చికిత్సకు వచ్చే సతీష్, అతని మేనల్లుడు కిరణ్ సహకరించారు. ముగ్గురూ కలసి ఆగస్టు 3న లక్ష్మీదేవిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 19 ముక్కలుగా నరికి సంచుల్లో వేసి 19 వేర్వేరు ప్రదేశాల్లో పారేశారు. హత్య అనంతరం రామచంద్రయ్య ధర్మస్థల ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇది పోలీసుల అనుమానాలకు మరింత బలం ఇచ్చింది. కారు ద్వారా దొరికిన ఆధారం కేసు ఛేదనలో కీలకమైంది. ప్రస్తుతం ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు.

తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్ మాట్లాడుతూ, ఈ హత్యకు మానవ బలి వంటి కోణం లేదని, ఇది పూర్తిగా కుటుంబ కలహాల ఫలితమని స్పష్టం చేశారు. అయితే శరీరాన్ని ఎందుకు ముక్కలుగా నరికి విభిన్న ప్రదేశాల్లో పారేశారన్న విషయం ఇంకా దర్యాప్తులో భాగమని తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను షాక్‌కు గురిచేసింది. అల్లుడు చేతిలో ఇంత క్రూరమైన రీతిలో ప్రాణాలు కోల్పోయిన అత్త సంఘటన మన సమాజంలో పెరుగుతున్న ద్వేషం, హింస యొక్క భయంకర రూపాన్ని మరోసారి గుర్తు చేసింది.

Related News

Hanuman Temple: హనుమాన్ ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి దోచుకెళ్లిన దొంగలు

Delhi Crime News: ఆగ్రాలో తెల్లవారుజామున చైతన్యానంద అరెస్ట్.. విద్యార్థులపై లైంగిక వేధింపులు

MP News: కజిన్ సిస్టర్‌తో భార్య సీక్రెట్ రొమాన్స్.. షాకైన భర్త, ఏం చెయ్యాలో తెలియక

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Big Stories

×