Khammam: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో ఒక ఘోర కలియుగ వింత చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యే కదా అని కాపాడుకోవాల్సింది పోయి, కేవలం డబ్బు పిచ్చితో ఓ భర్త ఆమె ప్రాణాలు తీశాడు. అప్పుల ఊబి నుంచి బయటపడటం కోసం, బీమా డబ్బులపై కక్కుర్తి పడి మీనాక్షి అనే మహిళను ఆమె భర్త శివాజీ అతి దారుణంగా కొట్టి చంపేశాడు.
ఆపై ఈ ఘోరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆమె ముందే ఉరివేసుకుని చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసి అక్కడి నుండి పరారయ్యాడు. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇలా డబ్బు కోసం బలిపశువును చేయడం స్థానికంగా పెను కలకలం రేపింది.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. వారి ఇంటిపై దాదాపు రూ. 80 లక్షల వరకు అప్పులు ఉన్నాయట. ఆ అప్పుల బాధ నుండి గట్టెక్కడానికి, మీనాక్షి పేరు మీద ఉన్న రూ. 1 కోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కుట్రతోనే శివాజీ ఈ దారుణానికి ఒడిగట్టాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించినట్లు బంధువులు కొన్ని ఆధారాలను, దృశ్యాలను బయటపెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఇలా కాలయముడిగా మారడం అందరినీ కలచివేస్తోంది.
Also Read: సచివాలయం వద్ద రణరంగం.. ‘తెలంగాణ రక్షణ సేన’ అధ్యక్షురాలు కవిత అరెస్ట్!
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హతమార్చిన భర్త..
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మీనాక్షి అనే మహిళను ఆమె భర్త శివాజీ దారుణంగా కొట్టి హత్య చేశాడు.
భార్యను చిత్రవధ చేసి చంపేసిన అనంతరం, తానే ఉరివేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించి నిందితుడు… pic.twitter.com/IIrEFpdUJe
— BIG TV Breaking News (@bigtvtelugu) May 22, 2026