Kavitha Arrest: రైతు సమస్యల పరిష్కారం కోసం సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల పక్షాన ఆందోళనకు దిగిన ఆమెను, పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. అనంతరం వారిని ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ముట్టడితో సచివాలయం పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సచివాలయం వద్ద హోరెత్తిన నినాదాలు
రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో TRS కార్యకర్తలు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకున్నారు. ‘రైతులకు న్యాయం చేయాలి’ అంటూ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట బస్తాలకు కోత పెడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆమె మండిపడ్డారు.
పోలీసుల రంగప్రవేశం
సచివాలయం వంటి హైసెక్యూరిటీ జోన్లో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు TRS శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేతులు దాటకుండా చూసేందుకు పోలీసులు కల్వకుంట్ల కవితతో పాటు ముఖ్య నాయకులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ గొంతు నొక్కేయాలని చూసినా, రైతుల సమస్యలు తీరే వరకు పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.
Also Read: మీ ఇంట్లో అందరూ సీఎంలేనా.. తెలంగాణ మీకోసం పుట్టిందా? కేటీఆర్పై అద్దంకి దయాకర్ ఫైర్
రైతుల కోసం సచివాలయం వద్ద టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ధర్నా
అరెస్ట్ చేసిన పోలీసులు
కవితను ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు pic.twitter.com/j2MrfPocxP
— BIG TV Breaking News (@bigtvtelugu) May 22, 2026