Krishna River: పల్నాడు జిల్లాలోని కోనూరు గ్రామం వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విహారయాత్ర కోసం సరదాగా బయలుదేరిన పదిమంది బంధువుల కుటుంబంలో ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. పదిమంది కలిసి ఒక పడవలో నదిలోకి విహారయాత్రకు వెళ్లారు. అయితే, తిరిగి వస్తున్న సమయంలో పడవ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో వారంతా నదిలో మునిగిపోయారు.
ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రాణాలకు తెగించి నదిలోకి దూకారు. తమవంతు ప్రయత్నంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో నీటిలో మునిగిపోయిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు . ఈ ఘటనతో కోనూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మునిగిపోయిన పడవ సాంకేతిక లోపంతో బోల్తా పడిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సురక్షితంగా బయటపడిన ఆరుగురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
also read: వర్షాకాలంలో ఏసీ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు ఆదా, ఇల్లూ ప్రశాంతం!
పడవ బోల్తా : ఒకే కుటుంబంలో నలుగురు మృతి
పల్నాడు జిల్లా కోనూరులో కృష్ణా నదిలో పడవ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. గంగయ్య ఇంట్లో శుభకార్యానికి వచ్చి, సరదాగా విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో కార్తిక్, చైతన్య, సైనీ, సంధ్య ఉన్నారు.… pic.twitter.com/sFAoNxE38R
— BIG TV Breaking News (@bigtvtelugu) June 14, 2026