E-Paper

కృష్ణానదిలో పడవ ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు!

కృష్ణానదిలో పడవ ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు!

Krishna River: పల్నాడు జిల్లాలోని కోనూరు గ్రామం వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విహారయాత్ర కోసం సరదాగా బయలుదేరిన పదిమంది బంధువుల కుటుంబంలో ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. పదిమంది కలిసి ఒక పడవలో నదిలోకి విహారయాత్రకు వెళ్లారు. అయితే, తిరిగి వస్తున్న సమయంలో పడవ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో వారంతా నదిలో మునిగిపోయారు.

ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రాణాలకు తెగించి నదిలోకి దూకారు. తమవంతు ప్రయత్నంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో నీటిలో మునిగిపోయిన మరో నలుగురిలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి కోసం గజ ఈతగాళ్లు, స్థానికులు , పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మునిగిపోయిన పడవ సాంకేతిక లోపంతో బోల్తా పడిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సురక్షితంగా బయటపడిన ఆరుగురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

also read: వర్షాకాలంలో ఏసీ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు ఆదా, ఇల్లూ ప్రశాంతం!

Related News

యాదాద్రి జిల్లాలో విషాదం.. గేట్ టుగెదర్ పార్టీలో టెక్కీ అనుమానస్పద మృతి!

అమ్మాయితో ప్రేమాయణం.. ఆంటీతో సహజీవనం, ఒత్తిడి పెరిగి ఆ యువకుడు ఏం చేశాడంటే

మెడికల్ షాపులో దారుణం.. క్యాషియర్‌పై దుండగుల కాల్పులు.. స్పాట్‌లో ఒకరు మృతి, సీసీటీవీ కెమెరా సాక్షిగా

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు

Shadi Scam: షాదీ ముబారక్ పథకంలో భారీ స్కామ్.. రూ. 21 లక్షలు కొల్లగొట్టిన బ్రోకర్లు అరెస్ట్!

Label Tampering: ఓల్డ్ అల్వాల్‌లో డీసీఏ మెరుపు దాడులు.. రూ.70.56 లక్షల ఫార్మా స్టాక్ సీజ్..!

×