Lorry Fire: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో శనివారం ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పించుకోగలిగారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టైల్స్ తయారికీ వాడే పౌడర్ ముడి పదార్థాన్ని తీసుకొని వెళ్తున్న లారీని జాతీయ రహదారిపై నిలిపి ఉంచారు. లారీ క్యాబిన్ లోపలే చిన్న గ్యాస్ సిలిండర్ సహాయంతో డ్రైవర్,క్లీనర్ వంట చేసుకుంటుండగా.. ఊహించని విధంగా సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలిపోయింది. క్షణాల్లోనే మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి. లోపల ఉన్న డ్రైవరు, క్లీనరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కిందకు దూకేయడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లారీ లోపల వంట చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.
Also Read: రైల్వే పట్టాలు కోసేయమంటే అరెస్ట్ చేయక హారతి ఇస్తారా? బాల్క సుమన్పై శివసేన రెడ్డి ఫైర్!
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో లారీ దగ్ధం
రోడ్డు పక్కన ఆపి.. లారీ లోపల వంట చేస్తుండగా.. ఒకసారిగా పేలిన సిలిండర్
లారీ నుంచి క్లీనరు, డ్రైవరు కిందకు దూకి ప్రాణాలు కాపాడుతున్నారు
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు pic.twitter.com/FN0s9OMkj9
— BIG TV Breaking News (@bigtvtelugu) May 30, 2026