E-Paper
Advertisement

Road Accident: విషాదం.. కారును ఢీకొట్టని మరో కారు.. దంపతులు మృతి

Road Accident: విషాదం.. కారును ఢీకొట్టని మరో కారు.. దంపతులు మృతి

Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు తమ కారులో ప్రయాణిస్తుండగా… భూత్పూర్ పరిధిలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన మరో కారు అతివేగంగా వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టని వేగానికి కారు పూర్తిగా నుజ్జు నుజ్జుయ్యింది. కారులో ఉన్న దంపతులకు తీవ్రగాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ప్రకారం కర్నూలు వాసులుగా గుర్తించి.. వారి బంధువులకు సమాచారం అందించారు.

ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. వెనుక నుంచి ఢీకొట్టిన కారు డ్రైవర్ అజాగ్రత్త లేదా నిద్రమత్తులో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసలు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: సంక్రాంతి పండగ ఎఫెక్ట్.. కోడి పందెం రాయుళ్ల రాకతో హోటల్ యజమానుల జేబులు ఫుల్

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×