E-Paper
Advertisement

Gurugram Crime| 7 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లివ్ ఇన్ పార్టనర్.. ఎందుకు చేసాడంటే..

ప్రీతి అనే మహిళ భర్త విజయ్ కుమార్ గత సంవత్సరం ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఉత్తర్ ప్రదేశ్, బిజ్ నోర్ కు చెందిన వినీత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో అభ్యంతరం చెప్పడంతో వినీత్, ప్రీతి సహజీవనం చేస్తున్నారు. ప్రీతికి ఆమె భర్త వల్ల ఇద్దరు కుమారులు మను (7), ప్రీత్ (8) ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా తల్లి వద్దే ఉన్నారు.

Gurugram Crime| 7 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లివ్ ఇన్ పార్టనర్.. ఎందుకు చేసాడంటే..

Gurugram Crime| ఒక ఏడు సంవత్సరాల బాలుడిని.. అతని తల్లితో సహజీవనం చేసే వ్యక్తి దారుణంగా కొట్టి చంపాడు. మరో బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సోమవారం రాత్రి గురుగ్రామ్ లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీతి అనే మహిళ భర్త విజయ్ కుమార్ గత సంవత్సరం ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఉత్తర్ ప్రదేశ్, బిజ్ నోర్ కు చెందిన వినీత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో అభ్యంతరం చెప్పడంతో వినీత్, ప్రీతి సహజీవనం చేస్తున్నారు. ప్రీతికి ఆమె భర్త వల్ల ఇద్దరు కుమారులు మను (7), ప్రీత్ (8) ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా తల్లి వద్దే ఉన్నారు.

Also Read: రూ.30 లక్షలు ఇస్తామని చెప్పి మోసం..కిడ్నీ దాతల దా‘రుణం’

పిల్లలంటే ఇష్టపడని వినీత్ తరుచూ.. ప్రీతి ఇంట్లో లేని సమయంలో వారిని కొట్టేవాడని వారి తాత తెలిపాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వినీత్.. ఇంట్లో ప్రీతి లేకపోవడం చూసి.. ఇద్దరు పిల్లలను చితకబాదాడు. చిన్న వాడు మనుని బలంగా గోడకేసి విసిరి కొట్టాడు. మరో పిల్లాడు ప్రీత్ ని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో మను తల నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది.

ప్రీతి ఇంటికి రాగానే ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో రక్త కారడం చూసి.. కేకలు పెట్టింది. దీంతో పొరుగు ఇంటి వారు వచ్చి పిల్లలను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్లు మను చనిపోయాడని నిర్ధారించారు. మరో పిల్లాడు ప్రీత్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో డాక్టర్లు అతనికి చికిత్స అందిస్తున్నారు.

Also Read: విరాట్ కోహ్లికి చెందిన పబ్ పై కేసు నమోదు.. బెంగళూరులో ఎఫ్ఐఆర్

మను హత్యకు కారణమైన వినీత్ ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Man kills LIve-in Partner’s son In Gurugram

 

Tags

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×