Fire Accident: స్వేచ్ఛ బ్యూరో: చేవెళ్ల మున్సిపాలిటీపరిదిలోని శంకర్ పల్లి రోడ్డులో ఉన్న ఓ హీరో హోండాకు సంబదించిన రిషిత ఆటో మొబైల్స్ అనే గోడాములో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి కరెంట్ షార్ట్ సరుక్యూట్ వల్ల గోదాములో మంటలు చెలరేగి గోదాము మొత్తం అంటుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 2కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడి స్థానిక నాయకులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న అన్నీ ఆటో మొబైల్స్ షాప్ లకు ఇక్కడి నుంచే వస్థువులను సప్లై చేసేవారు.
Also Read: Asaduddin Owaisi: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్.. మోదీకి ఒవైసీ సూటి ప్రశ్న, వారి మాటేంటి?
ఈ ఘటన రాత్రి జరగడంతో అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ జరిగిన దాన్ని పరిశీలించారు. అనంతరం ఫైర్ సేఫ్టీ పోలీసులుకు సమాచారం అందిచి, ఫైర్ ఇంజన్ సహయంతో మంటలను అర్పేశారు. ఈ సంఘటన రాత్రి సమయంలొ జరగడం వలన అక్కడి స్ధానికులకు తీవ్ర అనుమానాలు రేకితిస్తున్నాయి. దీంతో పోలీసుల సైతం పూర్తి విచారణ జరిపి నిజా నిజాలు తేల్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలు అదుపుచేసిన తరువాత పోలీసులు కేసు నమొదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంకా ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.