E-Paper
Advertisement

ప్రియుడి కోసం కన్నకొడుకును చంపిన తల్లి.. కర్నూలులో ఘోరం!

ప్రియుడి కోసం కన్నకొడుకును చంపిన తల్లి.. కర్నూలులో ఘోరం!
Advertisement

Kurnool Crime: సమాజం ఎటు పోతోంది? కామంధకారంలో పడి కన్నప్రేమను మర్చిపోతున్నారు కొందరు మహిళలు. తప్పును నిలదీశాడనే కోపంతో నవమాసాలు మోసి, పెంచిన కొడుకునే కడతేర్చిందో ఓ కషాయి తల్లి. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లా అదోని మండలం జి. హూసళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

స్వ గ్రామానికి చెందిన గంగమ్మకు దర్గప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన గంగమ్మ కుమారుడు వీరేంద్ర (15) నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన గంగమ్మ, తన కుమారుడిని ఎలా అయినా వదిలించుకోవాలని తన ప్రియుడితో కలిసి కొడుకును కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని స్థానిక శ్మశానంలో పాతిపెట్టింది. ఆపై ఏమీ తెలియనట్టు తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, విచారణ ఆలస్యమవుతోందంటూ హైకోర్టును కూడా ఆశ్రయించి నాటకమాడింది.

Advertisement

హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు నిఘా పెట్టగా అసలు నిజం బయటపడింది. కన్నతల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని తేలింది. దీంతో రెవెన్యూ, వైద్య బృందాల సమక్షంలో శ్మశానంలో పాతిపెట్టిన వీరేంద్ర మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. అయితే, పోలీసుల విచారణ భయంతో తీవ్ర అనారోగ్యానికి గురైన తల్లి గంగమ్మ.. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Also Read: నిర్మల్ జిల్లాలో ఘోరం.. కూలర్‌లో నీళ్లు పోస్తూ తండ్రీకొడుకులు దుర్మరణం!

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×