E-Paper
Advertisement

Women Suicide Attempt: నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చి బూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

Women Suicide Attempt:  నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చి బూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
Advertisement

నంద్యాలలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీసి తమ బాధను వివరించిన ఆమె.. తన భర్త షమీమ్‌ను ఓ కేసులో బయటకు తీసుకొస్తానని హుస్సేన్ అనే వ్యక్తి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. హుస్సేన్‌కు పోలీసులు సహకరిస్తున్నారని.. తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో.. సీఐని ఆశ్రయించగానే తనపై దుర్భాషలాడారని బాధితురాలు వీడియోలో తెలిపింది.

ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆవేశంలో ఫినాయిల్ తాగడంతో కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి క్షీణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సంఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు స్పందించారు. తమపై జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు గమనించి న్యాయం చేయడంతో పాటు సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అధికారులు కేసును దర్యాప్తుకు తీసుకుని వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×