Tadipatri suicide: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన 20 రోజులకే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. గన్నవారిపల్లి కాలనీలో నివసించే లక్ష్మీప్రసన్న అనే యువతి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
లక్ష్మీప్రసన్న తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా విధులు నిర్వహిస్తోంది. గత నెలలోనే ఈమెకు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన విజయ్ అనే యువకుడితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె పుట్టింటికి రాగా తిరిగి అత్తగారింటికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్తగారింటికి వెళ్లాల్సిన సమయంలో ఈ ఘోర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చేతికి ఉన్న గోరింటాకు ఇంకా ఆరకముందే నవవధువు ఇలా విగతజీవిగా మారడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: జగిత్యాలలో ఏసీబీ పంజా.. సీఐ, టీచర్ కలిసి చేసిన దందా మామూలుగా లేదుగా!