BigTV English
Advertisement

Shimla News: మనవడే కదా అని ఇంట్లోకి రానిస్తే.. ఏకంగా అమ్మమ్మపైనే అఘాయిత్యం

Shimla News: మనవడే కదా అని ఇంట్లోకి రానిస్తే.. ఏకంగా అమ్మమ్మపైనే అఘాయిత్యం

Shimla News: హిమాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువకుడు 65 ఏళ్ల బామ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


సిమ్లాలోని రోహ్రు పట్టణంలో 65 ఏళ్ల వృద్ధురాలు భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. అయితే వారం రోజుల క్రితం తన మనవడు ఆమె దగ్గరకు వచ్చాడని పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తన మనవడు బెదరించాడని ఫిర్యాదులో తెలిపింది.

దీంతో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద 64(2), 332(బీ), 351(3) కింద యువకుడిపై కేసు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ప్రణవ్ చౌహాన్ తెలిపారు.


మహారాష్ట్రలో మరో దారుణ ఘటన జరిగింది. పెళ్లి సాకుతో మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేశాడు. 26 ఏళ్ల యువకుడు పెళ్లి పేరుతో మహిళపై పలు సార్లు అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. థానేలోని బీవండిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అష్రప్ ఆఫ్సర్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు దుబాయ్ కి పారిపోవాలని ప్రయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. 25 ఏళ్ల యువతి వారం రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

నిందితుడు, మహిళతో ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడని.. అనంతరం వాళ్ల మధ్య స్నేహం.. పెళ్లి వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. పలు మార్లు అత్యాచారం చేశాడని చెప్పారు. 2024 జూన్, జులై నెలల్లో వివిధ ప్రదేశాల్లోకి తీసుకెళ్లి నిందితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

ALSO READ: END Vs IND 3rd Test : టాస్ గెలిచిన ఇంగ్లాండ్… ముగ్గురు డేంజర్ బౌలర్లతో రంగంలోకి టీమిండియా.. ఇక ఇంగ్లీష్ బ్యాటర్లకు నరకమే

ఇటీవల కాలంలో దేశంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. వీటిపై ప్రభుత్వాలు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు రావాలని కోరుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

ALSO READ: NHPC Recruitment: గుడ్ న్యూస్.. ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం.. జస్ట్ ఈ అర్హత ఉంటే చాలు

Related News

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Roof Collapse: ఇంటి పైకప్పు కూలిపోయి.. ఐదుగురి మృతి

Bhimavaram Crime: మా అమ్మ, తమ్ముడిని చంపేశా.. పోలీసులకు ఫోన్ చేసి, భీమవరంలో ఘోరం

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Big Stories

×