E-Paper
Advertisement

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?
Advertisement

Tamilnadu Crime: తమిళనాడులో ఓ ఎస్ఐ దారుణహత్యకు గురయ్యాడు. విపక్ష అన్నాడీఎంకె ఎమ్మెల్యేకి చెందిన ఓ ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. చివరకు వెంటాడి మరీ చంపేశారు. ఘటనతో తమిళనాడు పోలీసులు ఉలిక్కపడ్డారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో తండ్రి- ఇద్దరు కొడుకుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఆ విషయం తెలియగానే ఎస్ఐ షణ్ముగవేల్ అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత జోక్యం చేసుకున్నారు. పట్టరాని కోపంతో తండ్రి, ఇద్దరు కొడుకులు వెంటాడి మరీ ఎస్ఐని చంపేశారు. ఈ ఘటన తెలియగానే పోలీసులు షాక్ అయ్యారు.

Advertisement

సోమవారం రాత్రి రుప్పూర్ జిల్లాలోని ఉడుమల్‌పేట సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక AIADMK ఎమ్మెల్యే మహేంద్రన్ ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్నారు తండ్రీ-కొడుకులు. ఎస్టేట్‌లో మద్యం మత్తులో ఉన్నాడు తండ్రి మూర్తి. ఆ సమయంలో మూర్తి-కొడుకులు తంగపాండియన్, మణికందన్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది చివరకు గాలివానగా మారింది.

అదే సమయంలో అత్యవసర సేవలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాని ఆధారంగా స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ షణ్ముగవేల్ వెంటనే అక్కడకి బయలుదేరి వెళ్లారు. అప్పటికి ఎస్టేట్‌లో మూర్తి- ఇద్దరు కొడుకుల మధ్య కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కొడుకుల నుంచి మూర్తి విడదీశారు. గాయపడిన పెద్దాయనను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: అనంతపురం నవవధువు కేసులో బిగ్ ట్విస్ట్.. ఫ్రెండ్స్ చంపేశారా?

మూర్తి పెద్ద కొడుకు తంగపాండియన్‌తో ఎస్ఐ మాట్లాడుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన చిన్న కొడుకు మణికందన్ అధికారిపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ తర్వాత తండ్రి, పెద్ద కొడుకు దాడిలో చేసి అధికారిని వెంబడించి నరికి చంపారని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత వాహనం డ్రైవర్ తప్పించుకుని అధికారులకు సమాచారం ఇచ్చాడు.

ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడం పోలీసులు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎస్ఐ కుటుంబానికి కోటి ఆర్థిక సహాయం, అర్హత కలిగిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఇంకా స్పందించలేదు. శాసనసభ ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలల ముందు ఈ ఘటన జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×