E-Paper
Advertisement

Groom Commits Suicide: తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే వరుడు ఆత్మహత్య

Groom Commits Suicide: తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే వరుడు ఆత్మహత్య

The Groom Committed Suicide a day before the wedding at Nizamabad District: డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ (28) అనే యువకుడు పెళ్లి ఒకరోజు ఉందనగా ఉందనగా శుక్రవారం నాడు డిచ్ పల్లి శివారులోని గాయత్రి ఎన్ క్లేవ్‌లో పురుగలు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని హుటా హటిన నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్రత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తాము ఎవరికోసం బ్రతకాలి- ఎందుకోసం బ్రతకాలి అంటూ తల్లి దండ్రుల రోధనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్నడిచ్ పల్లి పోలీసులు ప్రశాంత్ మృతిపై కుటుంబ సభ్యులను వివరాలు తెలుసుకొని దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. వివాహానికి ఒకరోజు ముందు ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవడం గురుంచి పోలీసు మాట్లాడుతూ గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమించినట్లు, తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేయడం వల్లనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

Also Read:  ఏపీలో దారుణం.. భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం!

సూసైడ్ చేసుకున్న ప్రశాంత్ కు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేసి మృతుదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించిన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేష్ తెలిపాడు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×