E-Paper
Advertisement

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి
Advertisement

Kailasapatnam Church Orphans School Students Died: అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో ఒక అనాధల పాఠశాల రన్ అవుతోంది. ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది పిల్లలు ఉండగా.. వారిలో 27 మంది విద్యార్థులు నిన్న ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వారిని డిశ్చార్జ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థుల్లో.. ముగ్గురు మరణించారు. చికిత్స పొందుతూ మరో విద్యార్థి కూడా మరణించడంతో.. మృతుల సంఖ్య 4కి చేరింది.  ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. డిప్యూటీ డీఈఓ విచారణకు ఆదేశించారు. స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసిన 24 గంటల తర్వాత తినడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×