BigTV English

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Kailasapatnam Church Orphans School Students Died: అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో ఒక అనాధల పాఠశాల రన్ అవుతోంది. ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది పిల్లలు ఉండగా.. వారిలో 27 మంది విద్యార్థులు నిన్న ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వారిని డిశ్చార్జ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థుల్లో.. ముగ్గురు మరణించారు. చికిత్స పొందుతూ మరో విద్యార్థి కూడా మరణించడంతో.. మృతుల సంఖ్య 4కి చేరింది.  ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. డిప్యూటీ డీఈఓ విచారణకు ఆదేశించారు. స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసిన 24 గంటల తర్వాత తినడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 


 

Related News

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Big Stories

×