E-Paper
Advertisement

BIG BREAKING: మహారాష్ట్రలో ఘోరం.. రైలు ఢీకొని 20 మంది దుర్మరణం!

BIG BREAKING: మహారాష్ట్రలో ఘోరం.. రైలు ఢీకొని 20 మంది దుర్మరణం!
Advertisement

Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జలగావ్‌లో రైలు దిగి పట్టాలు దాటుతున్న ప్రయాణికులపైకి మరో రైలు దూసుకురావడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 ప్రయాణికులు మృతిచెందినట్లు సమాచారం.

వివరాల ప్రకారం.. ప్రమాదవశాత్తూ పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణకులు ట్రైన్ నుంచి బయటకు దూకారు. ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయాణికులు కిందకు దిగి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంతలోనే ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.

Advertisement

జల్గావ్‌లోని పచోరాలోని పర్ధాడే వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు పుష్పక్ ఎక్స్ ప్రెస్ నుంచి దాదాపు 40 మంది ప్రయాణికుల వరకు పట్టాలు దాటేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కొరకు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×