E-Paper
Advertisement

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన
Advertisement

Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కంచిలి, జలంత్ర కోట రహదారి సమీపంలో ఓ దాబా వద్ద దారుణ హత్య జరిగింది. ఉద్దేశ పూర్వకంగానే ఇద్దరు వ్యక్తుల మీదకు లారీ ఎక్కించి ఓ డ్రైవర్ కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ కు చెందిన ఓ లారీ డ్రైవర్ భోజనం చేసేందుకు జలంత్ర కోట రహదరి వద్దన ఉన్న ఓ దాబా వద్ద ఆగాడు. అదే దాబాకు వేరే వాహనంలో భోజనం చేసేందుకు మరి కొంత మంది వచ్చారు. అయితే ఉన్నట్టుండి వాహనం నుంచి దిగిన వ్యక్తులకు, లారీ డ్రైవర్ కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త పెద్ద గొడవకు దారి తీసింది.

Advertisement

ALSO READ: TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

గొడవ జరిగిన అనంతరం బిల్లు విషయంలో డ్రైవర్ కు, దాబా యజమానికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ నేరుగా వెళ్లి లారీ ఎక్కేందుకు ప్రయత్నించాడు. చివరకు డ్రైవర్ లారీ ఎక్కాడు. దీనికి దాబా యజమాని అడ్డుగా వచ్చాడు. దీంతో డ్రైవర్ లారీని యజామాని పైనుంచి వెళ్లించడంతో స్పాట్ లోనే అతను మృతిచెందాడు. దాబాకి పాలు ఇచ్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని ఆపేందుకు ఎదురుగా వెళ్లాడు. అతనిపై నుంచి కూడా లారీ దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తికి కాళ్లు విరిగి తీవ్రమైన రక్త స్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

ALSO READ: Apprentice Posts: రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. పది పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంకెందుకు ఆలస్యం

లారీ డ్రైవర్ దారుణంగా ఇద్దరినీ హత్య చేసి వాహనంతో పాటు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్న వారితో పాటు సమీప గ్రామస్థులు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×