Crime News: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ బస్ డిపో వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఇద్దరిు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, సుమారు 800 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే వారి వద్ద ఉన్నదాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Women Leaders: గాంధీ భవన్లో మహిళా యుద్ధం.. సీనియర్ల సీట్లకే ఎసరు పెడుతున్న లేడి డాన్లు!
ఈ గంజాయి విలువ సుమారుగా రూ. 40,000 కాగా, ఒక సెల్ఫోన్ విలువ రూ. 10,000గా ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయిన వారు తేజావత్ గోపాల్ (21), మంగపురం ప్రవీణ్ (21)గా పోలీసులు గుర్తించారు. గోపాల్ పై గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఉండగా, ప్రవీణ్ పై శివ్వంపేట పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పూర్తి సమాచారాన్ని సేకరిస్తామని పోలీసులు వెల్లడించారు.
Also Read: Logo Misuse: మీరు ట్యాంకర్ నీరు వాడుతున్నారా.. అయితే జలమండలి శాఖ షాకింగ్ కామెంట్స్!