Uttar Pradesh: దారుణం.. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తనే హతమార్చుతున్న భార్యలు.. ఈ మధ్య కాలంలో భార్యలను భర్తలు చంపడం, భర్తలను భార్యలు చంపడం చాలా కామన్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్లోని శంబల్ జిల్లా, చందౌసి ప్రాంతంలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. కట్టుకున్న భర్తను కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్యే, ప్రియుడి మోహంలో పడి అత్యంత కిరాతకంగా హతమార్చిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఆ తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు సమాజంలో నైతిక విలువల పతనాన్ని అద్దం పడుతోంది.
వివరాల్లోకి వెళ్తే, రాహుల్, రూబీ దంపతుల మధ్య గౌరవ్ అనే యువకుడి ప్రవేశంతో గొడవలు మొదలయ్యాయి. రూబీకి గౌరవ్తో ఏర్పడిన అక్రమ సంబంధం రాహుల్కు తెలియడంతో ఇంట్లో మనస్పర్థలు పెరిగాయి. తమ బంధానికి రాహుల్ శాశ్వతంగా అడ్డు తొలగిపోవాలని భావించిన రూబీ, ప్రియుడు గౌరవ్తో కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నింది. నవంబర్ 18వ తేదీన వారు తమ అమానుష పథకాన్ని అత్యంత క్రూరంగా అమలు చేశారు.
ఈ హత్య జరిగిన తీరు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిందితులు రాహుల్ను చంపడమే కాకుండా, సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. అంతటితో ఆగకుండా, ఆ శరీర భాగాలను గ్రైండర్లో వేసి మిశ్రమంగా మార్చి, సమీపంలోని కాలువలో పారబోశారు. ఒక మనిషిని చంపడమే కాకుండా, పార్థివ దేహాన్ని అంతటి అమానవీయంగా ముక్కలు చేయడం వారిలోని క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలిచింది.
నేరం చేసిన తర్వాత రూబీ ఏమీ తెలియనట్టుగా పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించగా, ఒక కాలువలో దొరికిన శరీర భాగాలపై ఉన్న ఒక ‘టాటూ’ ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆ పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాహుల్ అని గుర్తించిన పోలీసులు, అనుమానంతో రూబీని, ఆమె ప్రియుడు గౌరవ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.
Also Read: గర్భిణిపై వైసీపీ మూక దాడి.. మంత్రి లోకేష్ ఆగ్రహం
ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. గుడ్డి ప్రేమ, క్షణికానందాల కోసం కట్టుకున్న భర్తను ఇంత దారుణంగా చంపడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ఈ కిరాతకులకు కఠినమైన శిక్ష విధించాలని, అప్పుడే ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భర్తను అత్యంత కిరాతకంగా చంపిన మరో భార్య
ప్రియుడితో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా నరికి గ్రైండర్లో రుబ్బి కాలువలో కలిపేసిన వైనం
ఉత్తరప్రదేశ్-శంబల్ జిల్లా చందౌసి ప్రాంతంలో ఘటన
రాహుల్, రూబి భార్యాభర్తలు
గౌరవ్ అనే యువకుడితో రూబికి వివాహేతర సంబంధం
నవంబర్ 18న రాహుల్ను హత్య… pic.twitter.com/iSmrb2k9Sm
— BIG TV Breaking News (@bigtvtelugu) December 23, 2025