E-Paper
Advertisement

Uttar Pradesh: భర్తను చంపి.. గ్రైండర్లో వేసి పేస్టుగా మార్చిన భార్య, ఆ తర్వాత..

Uttar Pradesh: భర్తను చంపి.. గ్రైండర్లో వేసి పేస్టుగా మార్చిన భార్య, ఆ తర్వాత..
Advertisement

Uttar Pradesh: దారుణం.. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తనే హతమార్చుతున్న భార్యలు.. ఈ మధ్య కాలంలో భార్యలను భర్తలు చంపడం, భర్తలను భార్యలు చంపడం చాలా కామన్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్‌లోని శంబల్ జిల్లా, చందౌసి ప్రాంతంలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. కట్టుకున్న భర్తను కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్యే, ప్రియుడి మోహంలో పడి అత్యంత కిరాతకంగా హతమార్చిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఆ తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు సమాజంలో నైతిక విలువల పతనాన్ని అద్దం పడుతోంది.

వివరాల్లోకి వెళ్తే, రాహుల్, రూబీ దంపతుల మధ్య గౌరవ్ అనే యువకుడి ప్రవేశంతో గొడవలు మొదలయ్యాయి. రూబీకి గౌరవ్‌తో ఏర్పడిన అక్రమ సంబంధం రాహుల్‌కు తెలియడంతో ఇంట్లో మనస్పర్థలు పెరిగాయి. తమ బంధానికి రాహుల్ శాశ్వతంగా అడ్డు తొలగిపోవాలని భావించిన రూబీ, ప్రియుడు గౌరవ్‌తో కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నింది. నవంబర్ 18వ తేదీన వారు తమ అమానుష పథకాన్ని అత్యంత క్రూరంగా అమలు చేశారు.

Advertisement

ఈ హత్య జరిగిన తీరు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిందితులు రాహుల్‌ను చంపడమే కాకుండా, సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. అంతటితో ఆగకుండా, ఆ శరీర భాగాలను గ్రైండర్‌లో వేసి మిశ్రమంగా మార్చి, సమీపంలోని కాలువలో పారబోశారు. ఒక మనిషిని చంపడమే కాకుండా, పార్థివ దేహాన్ని అంతటి అమానవీయంగా ముక్కలు చేయడం వారిలోని క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలిచింది.

నేరం చేసిన తర్వాత రూబీ ఏమీ తెలియనట్టుగా పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించగా, ఒక కాలువలో దొరికిన శరీర భాగాలపై ఉన్న ఒక ‘టాటూ’ ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆ పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాహుల్ అని గుర్తించిన పోలీసులు, అనుమానంతో రూబీని, ఆమె ప్రియుడు గౌరవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

Advertisement

Also Read: గర్భిణిపై వైసీపీ మూక దాడి.. మంత్రి లోకేష్ ఆగ్రహం

ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. గుడ్డి ప్రేమ, క్షణికానందాల కోసం కట్టుకున్న భర్తను ఇంత దారుణంగా చంపడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ఈ కిరాతకులకు కఠినమైన శిక్ష విధించాలని, అప్పుడే ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×