Fake Theft: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ లేడి హై డ్రామా క్రియేట్ చేసింది. అచ్చం సినిమాను తలపించేలా ఓ హైప్ క్రియేట్ చేసింది. ఓ కిలేడీ తనను తానే తాళ్లతో మంచానికి కట్టేసుకుని రూ.30 లక్షల బంగారం కోసం తన ఇంట్లో దొంగతనం జరిగిందని నాటకం ఆడింది. మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయినా పోలీసుల దగ్గరకు రాగానే విచారణలో దొరికిపోయింది. విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించి కిలేడీ మోసాన్ని పోలీసులు భట్టబయలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండలో ఈ సంఘటన జరిగింది. అసలు విషయం ఎంటంటే ఓ లేడి తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులుకు సమాచారం అందించింది. దొంగలు ఇంట్లోకి చోరబడి భారీగా బంగారం దోచుకెల్లారని తెలిపింది. దీంతో తాను ఓంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి దొంగలు వచ్చి తనను మంచానికి కట్టేసి ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకెల్లారని పోలీసులుకు తెలిపింది. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమొదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఒకే చికిత్సకు రెండు హెల్త్ పాలసీల్లో క్లెయిమ్స్ చేసుకోవచ్చా? .. ప్రాసెస్ ఏంటి?
బాదితురాలు పద్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయండంతో విచారణలో భాగంగా డాగ్ స్కాట్ మరియు ఇద్దరు బృందంతో ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేసారు. దీనిలో పద్మ అనే మహిళ అసలు రంగు భయటపడింది. ఇన్సురెన్సు డబ్బులకోసం తనను తానే మంచానికి కట్టేసుకొని కావాలనే హై డ్రామా క్రియేట్ చేసిందని విచారణలో తేలింది. దీంతో షాక్ అయిన పోలీసులు మహిలపై కేసు నమొదు చేసి రిమాండుకు తరలించారు. డబ్బుల కోసం ఇంత దారున పనికి ఓడికట్టం హేయమని పోలీసు అక్కడి స్ధానికులు అనుకుంటున్నారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిలేడీ హై డ్రామా
తనను తానే తాళ్లతో కట్టేసుకుని రూ.30 లక్షల బంగారం దొంగతనం జరిగిందని నాటకం
సీసీ కెమెరాలను పరిశీలించి కిలేడీ మోసాన్ని బయటపెట్టిన పోలీసులు
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఘటన
A woman created a drama in Korukonda, East Godavari district,… pic.twitter.com/lGgPQix5Zx
— BIG TV Breaking News (@bigtvtelugu) March 30, 2026
Also Read: తమిళ రాజకీయంలో దళపతి ఎంట్రీ.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుండి బరిలోకి విజయ్..