E-Paper
Advertisement

అది ఫేక్..దయచేసి ఎవరూ నమ్మొద్దు అలర్ట్ చేసిన కుష్బూ !

అది ఫేక్..దయచేసి ఎవరూ నమ్మొద్దు అలర్ట్ చేసిన కుష్బూ !

Actress Khushbu: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల పేరుతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలు వారి పేర్లను చూసి ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయిన వారు ఉన్నారు. అయితే ఈ విధమైనటువంటి నష్టాల భారీ పడకుండా ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు తమ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్తలపై స్పందిస్తూ అభిమానులను హెచ్చరిస్తూ ఉంటారు. అయితే తాజాగా నటి కుష్బూ(Khushbu) సైతం సోషల్ మీడియా వేదికగా తన భర్త పేరు మీద ఉన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ గురించి పూర్తిగా స్పష్టత ఇచ్చారు.

తన భర్తకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్ లేదు..

నటి కుష్బూ భర్త సుందర్ .సి(Sundar.C) దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ పేజ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ఫేక్ అకౌంట్ పై కుష్బూ స్పందించారు. ఇలా సుందర్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఈమె తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. తన భర్త పేరు మీద ఉన్న ఈ అకౌంట్ పూర్తిగా ఫేక్ అని తెలిపారు. ఇప్పటివరకు తన భర్తకు సంబంధించి ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లేవని , తన భర్త పేరు మీద వచ్చే అకౌంట్లను ఎవరు నమ్మొద్దని, అవి పూర్తిగా ఫేక్ అంటూ ఈమె తెలియజేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సుందర్..

తన భర్త పేరు మీద త్వరలోనే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తామని దానిని అధికారికంగా వెల్లడిస్తాము అంటూ కుష్బూ ఈ సందర్భంగా అభిమానులకు తెలియజేశారు. ఇక సుందర్ సి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలలో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సుందర్ PNK పార్టీ తరపున మధురై నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన గురించి వస్తున్నటువంటి తప్పుడు వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.

ఇక కేవలం సుందర్ మాత్రమే కాకుండా కుష్బూ కూడా గత కొంతకాలంగా రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈమె ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయ కార్యకలాపాలలో కూడా బిజీగా ఉన్నారు. కుష్బూ మొదట్లో డిఎంకె పార్టీలో చేరారు అనంతరం ఈ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుష్బూ ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు ఇక గత ఏడాది ఈమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సుందర్ సైతం రాజకీయాలలోకి అడుగు పెట్టారు.

Also Read: మాజీ మరిది తప్పుకోవడంతో ముందుగానే వస్తున్న సమంత ‘మా ఇంటి బంగారం’!

Related News

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

Big Stories

×