Actress Khushbu: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల పేరుతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలు వారి పేర్లను చూసి ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయిన వారు ఉన్నారు. అయితే ఈ విధమైనటువంటి నష్టాల భారీ పడకుండా ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు తమ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్తలపై స్పందిస్తూ అభిమానులను హెచ్చరిస్తూ ఉంటారు. అయితే తాజాగా నటి కుష్బూ(Khushbu) సైతం సోషల్ మీడియా వేదికగా తన భర్త పేరు మీద ఉన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ గురించి పూర్తిగా స్పష్టత ఇచ్చారు.
నటి కుష్బూ భర్త సుందర్ .సి(Sundar.C) దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ పేజ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ఫేక్ అకౌంట్ పై కుష్బూ స్పందించారు. ఇలా సుందర్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఈమె తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. తన భర్త పేరు మీద ఉన్న ఈ అకౌంట్ పూర్తిగా ఫేక్ అని తెలిపారు. ఇప్పటివరకు తన భర్తకు సంబంధించి ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లేవని , తన భర్త పేరు మీద వచ్చే అకౌంట్లను ఎవరు నమ్మొద్దని, అవి పూర్తిగా ఫేక్ అంటూ ఈమె తెలియజేశారు.
తన భర్త పేరు మీద త్వరలోనే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తామని దానిని అధికారికంగా వెల్లడిస్తాము అంటూ కుష్బూ ఈ సందర్భంగా అభిమానులకు తెలియజేశారు. ఇక సుందర్ సి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలలో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సుందర్ PNK పార్టీ తరపున మధురై నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన గురించి వస్తున్నటువంటి తప్పుడు వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.
This is a fake account of Director #SundarC . He is not not any social media platform as on date. Pls do not follow this or interact on this or any other similar account on any social platform. . Shall be creating a new and verified account for him soon. 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/9P1VYV67U7
— KhushbuSundar (@khushsundar) March 30, 2026
ఇక కేవలం సుందర్ మాత్రమే కాకుండా కుష్బూ కూడా గత కొంతకాలంగా రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈమె ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయ కార్యకలాపాలలో కూడా బిజీగా ఉన్నారు. కుష్బూ మొదట్లో డిఎంకె పార్టీలో చేరారు అనంతరం ఈ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుష్బూ ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు ఇక గత ఏడాది ఈమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సుందర్ సైతం రాజకీయాలలోకి అడుగు పెట్టారు.
Also Read: మాజీ మరిది తప్పుకోవడంతో ముందుగానే వస్తున్న సమంత ‘మా ఇంటి బంగారం’!