E-Paper
Advertisement

అది ఫేక్..దయచేసి ఎవరూ నమ్మొద్దు అలర్ట్ చేసిన కుష్బూ !

అది ఫేక్..దయచేసి ఎవరూ నమ్మొద్దు అలర్ట్ చేసిన కుష్బూ !
Advertisement

Actress Khushbu: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల పేరుతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలు వారి పేర్లను చూసి ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయిన వారు ఉన్నారు. అయితే ఈ విధమైనటువంటి నష్టాల భారీ పడకుండా ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు తమ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్తలపై స్పందిస్తూ అభిమానులను హెచ్చరిస్తూ ఉంటారు. అయితే తాజాగా నటి కుష్బూ(Khushbu) సైతం సోషల్ మీడియా వేదికగా తన భర్త పేరు మీద ఉన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ గురించి పూర్తిగా స్పష్టత ఇచ్చారు.

తన భర్తకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్ లేదు..

నటి కుష్బూ భర్త సుందర్ .సి(Sundar.C) దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ పేజ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ఫేక్ అకౌంట్ పై కుష్బూ స్పందించారు. ఇలా సుందర్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఈమె తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. తన భర్త పేరు మీద ఉన్న ఈ అకౌంట్ పూర్తిగా ఫేక్ అని తెలిపారు. ఇప్పటివరకు తన భర్తకు సంబంధించి ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లేవని , తన భర్త పేరు మీద వచ్చే అకౌంట్లను ఎవరు నమ్మొద్దని, అవి పూర్తిగా ఫేక్ అంటూ ఈమె తెలియజేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సుందర్..

Advertisement

తన భర్త పేరు మీద త్వరలోనే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తామని దానిని అధికారికంగా వెల్లడిస్తాము అంటూ కుష్బూ ఈ సందర్భంగా అభిమానులకు తెలియజేశారు. ఇక సుందర్ సి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలలో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సుందర్ PNK పార్టీ తరపున మధురై నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన గురించి వస్తున్నటువంటి తప్పుడు వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.

Advertisement

ఇక కేవలం సుందర్ మాత్రమే కాకుండా కుష్బూ కూడా గత కొంతకాలంగా రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈమె ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయ కార్యకలాపాలలో కూడా బిజీగా ఉన్నారు. కుష్బూ మొదట్లో డిఎంకె పార్టీలో చేరారు అనంతరం ఈ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుష్బూ ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు ఇక గత ఏడాది ఈమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సుందర్ సైతం రాజకీయాలలోకి అడుగు పెట్టారు.

Also Read: మాజీ మరిది తప్పుకోవడంతో ముందుగానే వస్తున్న సమంత ‘మా ఇంటి బంగారం’!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×