E-Paper
Advertisement

ప్రేమ విఫలమైందని ర్యాపిడో డ్రైవర్ ఆత్మహత్య!

ప్రేమ విఫలమైందని ర్యాపిడో డ్రైవర్ ఆత్మహత్య!
Advertisement

Love Suicide: స్వేచ్ఛ బ్యూరో: ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాంపరి పద్మ-దుర్గయ్య దంపతులకు 27 సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు పాంపరి అరవింద్ (24) రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

తరచూ వివాదాలు

అరవింద్ గత ఐదేళ్లుగా తన బంధువైన చింతల శిరీష (25), మల్లికార్జున కాలనీ, కాప్రా మండలానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు తెలిసిన తరువాత తరచూ వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మార్చి 31న ఉదయం 11 గంటల సమయంలో పని కోసం వెళ్తున్నానని చెప్పి అరవింద్ ఇంటి నుండి బయలుదేరాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి ఫోన్ చేయగా, తర్వాత మాట్లాడతానని చెప్పి కాల్ నిలిపివేశాడు. అనంతరం ఆమె నైట్ డ్యూటీకి వెళ్లింది.

Advertisement

Also Read: అన్నదాతకు సాగు సెగ.. వాణిజ్య పంటల సాగుతో రైతులు విలవిల

తెల్లవారుజామున..

ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో అరవింద్ గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటాన్ని గమనించిన తండ్రి లోపలికి వెళ్లి చూడగా, ఇనుప రాడ్‌కు చీరతో వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దింపినా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదుదారు పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో దారుణం.. బిర్యానీలో గుట్కా ప్యాకెట్, ఏ హోటల్ అంటే?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×