E-Paper
Advertisement

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

MK Stalin: త‌మిళ‌నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దేశంలో మళ్ళీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రాల అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం పేరును కూడా మార్చే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి.

తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్రను దెబ్బతీయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్టాలిన్ ఆరోపించారు. “బీజేపీ అధికారంలోకి వస్తే కేవలం పరిపాలన మార్పు మాత్రమే కాదు, మన రాష్ట్రం పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడును వారు కేవలం ఒక భూభాగంగా చూస్తారు తప్ప, మన భాషా ప్రాతిపదికన ఏర్పడిన అస్తిత్వాన్ని గౌరవించరు.” అని ఆయన విమర్శించారు. గతంలో గవర్నర్ తమిళగం అనే పదాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ మన రాష్ట్రం పేరులోని నాడు (దేశం/నేల) అనే పదాన్ని తొలగించాలని చూస్తోందని దుయ్యబట్టారు.

Advertisement

సమాఖ్య వ్యవస్థను అణిచివేసి, దేశమంతటా ఒకే దేశం, ఒకే భాష అనే ఏకపక్ష విధానాన్ని రుద్దాలని ఎన్డీయే చూస్తోందని స్టాలిన్ అన్నారు. ద్రవిడ మోడల్ పాలనను దెబ్బతీయడానికి కేంద్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని, నిధుల కేటాయింపులో కూడా వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలంటే ఎన్డీయేను గద్దె దించడమే ఏకైక మార్గమని ఆయన పిలుపునిచ్చారు.

తమిళ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించే శక్తులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని స్టాలిన్ ఓటర్లను కోరారు. ఇది కేవలం అధికారం కోసం జరుగుతున్న పోరాటం కాదని, తమిళనాడు భవిష్యత్తు మరియు గుర్తింపును కాపాడుకునే యుద్ధమని ఆయన అభివర్ణించారు. “మన పేరు, మన భాష, మన హక్కులు మన దగ్గరే ఉండాలంటే ఇండియా (INDIA) కూటమిని గెలిపించండి.” అని స్టాలిన్ స్పష్టం చేశారు.

Advertisement

Read Also: మోదీ, పినరయి ఇద్దరూ ఒక్కటే.. కేర‌ళ‌లో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×