E-Paper
Advertisement

మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!

మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!

Road Accident: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మునిరాబాద్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపై నిలిపి ఉంచిన పాల ట్యాంకర్‌ను వేగంగా వస్తున్న అశోక్ లేలాండ్ బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన కిషోర్ (20) తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

Also read: హైదరాబాద్‌లో ఎబోలా కలవరం.. ఒకరికి నెగటివ్, రెండో కేసుపై ఉత్కంఠ!

పరిస్థితి విషమం..

మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: రామ్‌చరణ్ ఊచకోత.. 2 రోజుల్లో ‘పెద్ది’ కలెక్షన్స్ ఎంతో తెలుసా? మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Related News

వికారాబాద్‌లో కుప్పకూలిన హోటల్‌ స్లాబ్‌.. ఒకరి మృతి

చిమిర్యాల స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన విద్యార్థుల రికార్డులు!

భీంగల్‌లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!

మిర్యాలగూడలో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి!

Punjab: ఆఫీసులో దారుణం.. మాజీ ప్రియురాల్ని 20 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు, ఆపై తనకు తాను

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ మృతి, ఏం జరిగింది? ఎవరున్నారు?

Big Stories

×