BigTV English

Mahakumbh 2025: ఈ విషయాలు తెలిస్తే చాలు.. కుంభమేళాకు ఈజీగా వెళ్లి రావొచ్చు

Mahakumbh 2025: ఈ విషయాలు తెలిస్తే చాలు.. కుంభమేళాకు ఈజీగా వెళ్లి రావొచ్చు

Mahakumbh 2025: మహాకుంభమేళా 2025 జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద దివ్యమైన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశంలోని దాదాపు అనేక నగరాల నుండి ప్రయాగ్‌రాజ్‌కి రైలు, విమాన ఏర్పాట్లు కూడా చేశారు. సంగం నగరానికి బస్సు లేదా ప్రైవేట్ వాహనం ద్వారా కూడా చేరుకోవచ్చు.


కానీ మొదటి సారి కుంభమేళాకు వెళ్లే వారు ఈ విషయాలను తెలుసుకుంటే ఈజీగా వెళ్లి రావచ్చు. ప్రయాగ్‌రాజ్ చేరుకోవడం నుండి మహాకుంభామేళారకు హాజరు కావడం, సంగంలో స్నానం చేయడం , హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం వరకు వివరంగా మొత్తం సమాచారాన్ని ఇక్కడ అందించబడింది. మీరు కూడా మొదటిసారిగా మహాకుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నారా ? అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసమే.

ప్రయాగ్‌రాజ్‌కి ఎలా చేరుకోవాలి ?


మొదటిది: ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం
రెండవది: ప్రధాన రైల్వే స్టేషన్లు
ప్రయాగ్‌రాజ్ జంక్షన్ (మెయిన్)
ప్రయాగ్‌రాజ్ చివ్కీ
ప్రయాగరాజ్ సంగం
సుబేదార్‌గంజ్
నైని జంక్షన్ (సమీపంలో)

ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లాలని అనుకునే వారు లక్నో వరకు విమానంలో ప్రయాణించవచ్చు.

సంగం ప్రాంతానికి ఎలా చేరుకోవాలి ?

ప్రయాగ్‌రాజ్ రెవెల్ స్టేషన్ లేదా విమానాశ్రయం నుండి మహాకుంభమేళా నిర్వహించబడుతున్న సంగం ప్రాంతానికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో 2 మార్గాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుండి కిడ్‌గంజ్ బోట్ క్లబ్‌కి ఆటో/క్యాబ్‌లో వెళ్లండి.

తర్వాత మీరు బోట్ ప్రయాణం ద్వారా నేరుగా సంగమ ప్రాంతానికి వెళ్లండి.

బోట్ ఛార్జీలు ఒక్కో వ్యక్తికి రూ. 200 నుండి రూ. 2000 వరకు ఉంటాయి. డిమాండ్, మీరు అడిగితే తగ్గిస్తారు.

బోట్ మిమ్మల్ని కిడ్‌గంజ్ బోట్ క్లబ్ నుండి పికప్ చేసుకుని అక్కడ స్నానం చేసిన తర్వాత తిరిగి అదే ప్రదేశానికి చేరుకుంటుంది.

2. మీరు నైని జంక్షన్‌కు వెళితే గనక, అక్కడి నుండి ఆటో/క్యాబ్‌లో ఆరైల్ ఘాట్ చేరుకోవచ్చు.

పగటి సమయంలో ఆరైల్ ఘాట్ నుండి పడవలు అందుబాటులో ఉంటాయి. వీరిని సంగం ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.100 నుంచి రూ.300 వరకు చార్జ్ చేస్తారు.

అర్ధరాత్రి 1-2 గంటలకు ఆరైల్ ఘాట్ లేదా సోమేశ్వర్ నాథ్ ఆలయ మార్గంలో చేరుకోవచ్చు. సంగం గేట్ (బ్రిడ్జి నెం. 3) వైపు ఆటోలో లేదా తాత్కాలిక వంతెనను ఉపయోగించి వెళ్లవచ్చు. సంగం ఘాట్ వంతెన 3 నుండి సమీపంలో ఉంది. 20-30 నిమిషాల నడక పడుతుంది.

ఘాట్ వద్ద సంగమ స్నానం:

ఘాట్ వద్ద ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు చేస్తారు. ఈ అనుభవం స్వర్గానికి మించినది. తెల్లవారుజామున 4 గంటలకు సంగమం వద్ద చల్లగా ఉంటుంది. కానీ స్నానం తర్వాత ఉత్సాహంగా, వెచ్చగా అనిపిస్తుంది. స్నానం తర్వాత అర్ఘ్ ,హాఆరతి సమర్పించడం మర్చిపోవద్దు. దీని తర్వాత శ్రీ బడే హనుమాన్ జీ ఆలయం, అక్షయవత్ వైపు వెళ్లండి.

25-30 నిమిషాలు నడిచిన తర్వాత హనుమాన్ ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ హనుమంతుని ఆశీస్సులు తీసుకోండి. ఇక్కడ భారీ రద్దీ ఉంటుంది. దర్శనానికి అరగంట పడుతుంది. దర్శనం తర్వాత, మీరు ఫెయిర్ ఎంట్రీ ప్రాంతానికి మరో 20-25 నిమిషాలు నడవాలి. ఈ స్థలం నుండి హోటల్ లేదా రైల్వే స్టేషన్/విమానాశ్రయానికి ఆటో/క్యాబ్‌లో చేరుకోవచ్చు.

Also Read:  శని సంచారం.. మార్చి 29 నుండి వీరిపై సంపద వర్షం

ఏ విషయాలు గుర్తుంచుకోవాలి ?

భారీ జనసమూహం కారణంగా కొన్నిసార్లు అసౌకర్యంగా ఉండవచ్చు.
రద్దీ ఎక్కువగా ఉండడంతో జాతర ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లు అధ్వానంగా ఉంటాయి. మరుగుదొడ్ల విషయంలో మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
జాగ్రత్తగా ప్రయాణించండి. నగదును వెంట తీసుకెళ్లండి. మీ లగేజీని జాగ్రత్తగా చూసుకోండి.
తెల్లవారుజామున స్టేషన్ నుండి 2 గంటలకు ప్రయాణం ప్రారంభిస్తే ఉదయం 7 గంటలకల్లా జాతర ప్రాంగణం అన్నీ పూర్తి చేసుకుని బయటికి రావచ్చు. ఇందకు మీకు దాదాపు 5 గంటలు పడుతుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×