BigTV English

2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా

2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా

2025 Physical Disability Champions Trophy: టీమిండియా క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌ను ఓడించి 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీని ( 2025 Physical Disability Champions Trophy ) భారత్ గెలుచుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి మరి… ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలవడం జరిగింది. 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ  ( 2025 Physical Disability Champions Trophy )  ఫైనల్‌ శ్రీలంకలోని కటునాయకేలోని ఎఫ్‌టిజెడ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగింది. అయితే, 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ లో 79 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి…ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా.


Also Read: ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?

 


ఇక ఈ దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( 2025 Physical Disability Champions Trophy )  ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయిన టీమ్ ఇండియా చివరకు ఫైనల్ లో గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు ( Team India) నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది.

టీమిండియా తరఫున యోగేంద్ర సింగ్ బదౌరియా ( Yogendra Singh Bhadoriya )… అద్భుతంగా ఆడడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. 40 బంతుల్లో ఏకంగా 73 పరుగులు చేసి.. టీమిండియాను ( Team India) ఆదుకున్నాడు యోగేంద్ర సింగ్ బదౌరియా ( Yogendra Singh Bhadoriya ). ఇక 198 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఇంగ్లాండ్ జట్టు తడబడిపోయింది. నీతో చివరకు ఓడిపోయింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు ( England )… చివరకు 118 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

Also Read: U19 Women’s T20 World Cup 2025: వైష్ణవికి హ్యాట్రిక్.. మలేషియాపై 2 ఓవర్లలోనే టీమిండియా విక్టరీ

ఇంకేముంది ఈ దెబ్బకు… 79 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఇక దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో ( 2025 Physical Disability Champions Trophy )  విజేత అయిన టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో మొత్తం నాలుగు జట్లు పాల్గొనడం జరిగింది. ఈ నాలుగు జట్టలో టీమిండియా ఇంగ్లాండ్ అలాగే శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో టీమిండియా ఏకంగా ఆరు మ్యాచ్లు ఆడితే ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించడం జరిగింది. ఒకే ఒక్క మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఈ టోర్నమెంట్లో మొట్టమొదట మ్యాచ్ పాకిస్తాన్ జట్టును ఓడించి.. విజయకేతనం ప్రారంభించింది టీమిండియా. చివరకు ఇంగ్లాండును ఫైనల్ మ్యాచ్లో ఓడించి… ఛాంపియన్గా నిలిచింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×