Pragya Jaiswal: టాలీవుడ్ అందాల తార ప్రగ్వా జైస్వాల్ మోడల్ గా కెరియర్ ప్రారంభించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ చిత్రాలలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన ప్రగ్యా, యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే మోడల్ గా మారింది. ఫెమినా మిస్ ఇండియా 2008, ఫ్రెష్ ఫేస్ మిస్ డాన్సింగ్ క్వీన్ టైటిల్స్ ను గెలుచుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఇన్స్టాగ్రామ్ లో తన ఫిట్నెస్ వీడియోలను, ఫ్యాషన్ ఫోటోషూట్లను, సినిమాకి సంబంధించిన అంశాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈమె కెమెరాలో బంధించి తన అందాలను అభిమానులతో పంచుకుంది.. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..
స్వర్గం నుండి భూమివైకి దిగివచ్చిన దేవకన్య..
తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేశారు. నయాగారా లాంటి నడుముతో.. ఈ సొగసుల సోయగం.. సూర్యుని తన చేతిలో బంధిస్తూ.. ప్రశాంతమైన చంద్రబింబంతో.. చిరునవ్వు విసురుతూ.. కుర్రకారుకి కిక్కించే చూపులతో కట్టిపడేసే ఫోటోలకి ఫోజులిస్తూ.. ఈనెల అద్భుతమైనది అని క్యాప్షన్ తో ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన వారంతా ఆమె అందాలకు ఫిదా అవుతూ.. క్యూట్, బ్యూటిఫుల్, స్వర్గం నుండి భూమిపైకి దిగివచ్చిన దేవకన్య అని కామెంట్స్ పెడుతున్నారు.
కెరియర్ ..ఇలా ..సాగింది
ఇక ప్రగ్యా సినిమాల విషయానికి వస్తే.. కంచె సినిమాలో సీత క్యారెక్టర్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ఓం నమో వెంకటేశాయ మూవీ లో భవానీ క్యారెక్టర్ తో అలరించారు. 2017లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన గుంటూరోడు సినిమాలో అమృత గా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సంవత్సరం నక్షత్రం, జయ జానకి నాయక సినిమాలతో సక్సెస్ ని అందుకుంది. మంచు విష్ణు హీరోగా ఆచారి అమెరికా యాత్ర మూవీలో, మెగాస్టార్ చిరంజీవి సైరా వంటి సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంది. 2021 లో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య బాబు తో నటించి మెప్పించారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇక ఈ ఏడాది మరోసారి బాలకృష్ణతో జతకట్టి డాకు మహారాజ్ సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు లో మరో మూవీ ఏమి రాలేదు. ఈమె బాలీవుడ్ లో చిత్రాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.