E-Paper
Advertisement

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్
Advertisement

Ayodhya Ram Mandir: మరికొన్ని గంటల్లో 500 ఏళ్ల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా తయారైంది. ఆలయాలు, ప్రధాన మార్గాలను దగదగ మెరిసే విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో అయోధ్య నగరం మారుమోగిపోతోంది. ఈ మహోత్సవంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. మెగా ఫ్యామిలీకి ఇప్పటికే ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు వారికి ఆహ్వానపత్రికలు స్వయంగా అందజేశారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం అయోధ్యకు చేరుకుంది.

Advertisement

ఈ సందర్భంగా చిరంజీవి ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులతో మాట్లాడారు. తాను ఆంజనేయుడి భక్తుడినని.. ఆయనే స్వయంగా తనను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగస్వామిని కాబోతోండటం.. జీవితకాలం అవకాశమని పేర్కొన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×