BigTV English
Advertisement

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్

Ayodhya Ram Mandir: మరికొన్ని గంటల్లో 500 ఏళ్ల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా తయారైంది. ఆలయాలు, ప్రధాన మార్గాలను దగదగ మెరిసే విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో అయోధ్య నగరం మారుమోగిపోతోంది. ఈ మహోత్సవంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.


ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. మెగా ఫ్యామిలీకి ఇప్పటికే ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు వారికి ఆహ్వానపత్రికలు స్వయంగా అందజేశారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం అయోధ్యకు చేరుకుంది.

ఈ సందర్భంగా చిరంజీవి ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులతో మాట్లాడారు. తాను ఆంజనేయుడి భక్తుడినని.. ఆయనే స్వయంగా తనను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగస్వామిని కాబోతోండటం.. జీవితకాలం అవకాశమని పేర్కొన్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×