E-Paper
Advertisement

Priyanka Chopra: 3 లగ్జరీ అపార్ట్మెంట్స్ ను అమ్మేసిన SSMB 29 బ్యూటీ.. ఏమైందంటే..?

Priyanka Chopra: 3 లగ్జరీ అపార్ట్మెంట్స్ ను అమ్మేసిన SSMB 29 బ్యూటీ.. ఏమైందంటే..?
Advertisement

Priyanka Chopra:ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో హాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ తన నటనతో హాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించి, గ్లోబల్ స్టార్ గా భారీ క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే హాలీవుడ్ ఐకాన్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా.. ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల మేరా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఈమె తన భర్త ప్రముఖ సింగర్ నిక్ జోనాస్ తో కలిసి అమెరికాలో నివసిస్తున్న విషయం తెలిసిందే.

మూడు లగ్జరీ అపార్ట్మెంట్స్ ను అమ్మేసిన ప్రియాంక చోప్రా..

Advertisement

హాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే ఇప్పుడు ఇండియన్ సినిమాలలో కూడా నటించడానికి ముంబైలో అడుగు పెట్టింది. అందులో భాగంగానే దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Maheshbabu) హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29) సినిమా ద్వారా ఇప్పుడు ఇండియన్ చిత్రాలలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా కొన్నాళ్లు హైదరాబాదులో బస చేసిన ఈమె.. ఇప్పుడు ముంబైకి చేరుకుంది. ఇక ఒకవైపు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే.. మరొకవైపు ఈమె ముంబై ఆస్తుల అమ్మకం గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలోని అందేరీ వెస్ట్ లో ఉన్న 3 హై అండ్ అపార్ట్మెంట్లను మొత్తం రూ.16.17 కోట్లకు సేల్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అపార్ట్మెంట్స్ వివరాలు ఇవే..

Advertisement

ముఖ్యంగా లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్ లో ఉన్న భారీ భవంతిలో 18వ అంతస్తులోని రెండు ఫ్లాట్లు, 19వ అంతస్తులో ఒక ఫ్లాట్ ని కలిపి విక్రయించారని సమాచారం. 18వ అంతస్తులోని 1,075 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను రూ.3.45 కోట్లకు అమ్మిన ఈమె, ఒక పార్కింగ్ స్థలంతో సహా ఈ అపార్ట్మెంట్ కోసం రూ.17.26 లక్షల స్టాంపు డ్యూటీ కూడా చెల్లించారు. అలాగే అదే అంతస్తులో ఉన్న మరో 885 చదరపు అడుగుల ఫ్లాట్ ను రూ. 2.85 కోట్లకు అమ్మగా.. రూ.14.25 లక్షల స్టాంపు డ్యూటీని చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక మూడవ అపార్ట్మెంట్ ధర సుమారు రూ.9 కోట్లు ఉండగా.. దీనికి కూడా భారీ ధరలోనే స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం. ఇక మొత్తంగా ఈ మూడు అపార్ట్మెంట్లు కలిపి రూ.16.17 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఇకపోతే అమెరికాలోనే తన భర్తతో ఉంటూ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఈమె సడన్గా ముంబైలో ఉన్న అపార్ట్మెంట్స్ అమ్మడంతో అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇంత సడన్ గా ఈ ఆస్తులను అమ్మడానికి గల కారణం ఏంటా అని ఆరా తీస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె అమెరికాలోనే ఉంటున్న నేపథ్యంలో ఇక్కడున్న అపార్ట్మెంట్స్ తో పనిలేదని, అందుకే వాటిని నమ్మకానికి పెట్టిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు .మరి ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికి అయితే ప్రియాంక చోప్రా మూడు ఖరీదైన ఫ్లాట్లను అమ్మేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై కూడా నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×