E-Paper
Advertisement

Boney Kapoor: తొలిసారి శ్రీదేవి మరణం పై నోరు విప్పిన నిర్మాత.. అదే ప్రాణం తీసింది అంటూ..?

Boney Kapoor: తొలిసారి శ్రీదేవి మరణం పై నోరు విప్పిన నిర్మాత.. అదే ప్రాణం తీసింది అంటూ..?
Advertisement

Boney Kapoor: ప్రముఖ దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi ) తన అందచందాలతో యావత్ భారత దేశ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా అందాల సుందరిగా,అతిలోక దేవతగా పేరు దక్కించుకుంది. ఎంత అందం ఉన్నా.. చిన్న వయసులోనే మరణించడం ఆమె అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ఈమె మరణం ఎలా సంభవించింది అంటే..? మాత్రం, ఆమె బాత్ టబ్ లో పడి చనిపోయింది కదా! అందరికీ తెలిసిందే కదా! అంటారు. కానీ దీనికంటే బలమైన కారణం ఒకటి ఉంది అని, శ్రీదేవి మరణించిన చాలా ఏళ్ల తర్వాత ఆమె భర్త బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్(Boney Kapoor) నోరు విప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2018లో దుబాయ్ లో మరణించిన శ్రీదేవి.

Advertisement

భారతీయ సినీ పరిశ్రమలో మొదటి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. దేశంలోని ప్రముఖ నటులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె, తన నటనతో కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉంది..ఇకపోతే శ్రీదేవి దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె స్టే చేసిన హోటల్ లోని బాత్ టబ్ లో పడి మరణించింది. కానీ ఈమె మరణం పై ఇప్పటికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోణీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య మరణం.. విషాదం అంటూ తెలిపారు.

ఆ బలమైన కోరికే ఆమె ప్రాణాలు తీసింది..

Advertisement

బోణీ కపూర్ మాట్లాడుతూ..”శ్రీదేవి ఎప్పుడూ కూడా తన రూపం గురించే ఎక్కువ శ్రద్ధ వహించేది. ఆమె ఆన్ స్క్రీన్ పాత్రల కోసం ఒక నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉండాలని అనుకుంటు ఉండేది. అందంగా కనిపించడానికి తరచూ ఎన్నో కఠినమైన చర్యలు కూడా తీసుకునేది. ఆ కఠినమైన నియమాలకు మేము కూడా ఆశ్చర్యపోయే వాళ్ళం. ముఖ్యంగా తరచుగా క్రాష్ డైట్ లను పాటించేది. అంతేకాదు తాను అనుకున్న రూపాన్ని పొందడానికి తిండి కూడా తినేది కాదు. అందంగా ఉండాలనే కోరిక అందరిలో ఆందోళన కలిగించేది. కొన్నిసార్లు ఆమె ఆరోగ్యాన్ని కూడా అది ప్రభావితం చేసింది. అయినా సరే శ్రీదేవి తన రూపాన్ని పొందడం కోసం ప్రయత్నాలు విరమించేది కాదు. నాతో పెళ్లి అయినప్పటి నుంచి శ్రీదేవికి ‘లో బీపీ సమస్య’ ఉండేది. కఠినమైన ఆహార నియమాల కారణంగానే ఇలా ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంది. ఎప్పుడూ తాను తినే కూరల్లో ఉప్పు లేకుండా చూసుకునేది. దీనికి తోడు బయట హోటల్లో తింటే రాత్రి భోజనంలో ఉప్పు లేకుండా ఆహారం తీసుకునేది అదే ఆరోగ్యానికి కీడుగా మారింది.. అందం కోసం ఆమె ప్రాకులాడడం వల్లే ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి మరణించింది” అంటూ బోణీ కపూర్ కామెంట్లు చేశారు.

ఫ్యాన్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న శ్రీదేవి..

మొత్తానికైతే శ్రీదేవి మరణం పై బోణీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు ఒకసారి ఒక రూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరాధించారు అంటే, ఎప్పటికీ అదే రూపం కోరుకుంటారు అని సెలబ్రిటీలు కొంతమంది భావిస్తారు. అలాంటి వారిలో శ్రీదేవి కూడా ఒకరు. అందుకే అభిమానులను మెప్పించడం కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది శ్రీదేవి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×