E-Paper
Advertisement

RGV Vyooham – Sapatham Movies: వ్యూహం, శపథం మూవీల రిలీజ్ డేట్లు ప్రకటించిన ఆర్జీవి

RGV Vyooham – Sapatham Movies: వ్యూహం, శపథం మూవీల రిలీజ్ డేట్లు ప్రకటించిన ఆర్జీవి
Latest movies in tollywood

RGV Vyooham – Sapatham Movies Release Dates(Latest movies in Tollywood): వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. సినిమా ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ అంచనాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు దర్శకుడు ఆర్జీవి. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ ప్రేక్షకాభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా మాసివ్ స్పందన వచ్చింది. ఇక సెన్సార్ పూర్తి చేసుకుని జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటికే రిలీజైన ట్రైలర్‌‌తో ఈ సినిమాపై దుమారం రేగింది. ముఖ్యంగా ట్రైలర్‌లో.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులను కించపరిచినట్లు పేర్కొంటూ ఆ పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మూవీ విడుదలను ఆపాలంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమా సెన్సార్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దుచేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ మూవీ యూనిట్.. డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్.. ఈ మూవీని మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డుకు ఆదేశించింది. దీంతో ఈ మూవీని మరోసారి సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా ఈ వివాదం నుంచి బయటపడి రిలీజ్‌కు సిద్ధమైంది.

READ MORE: RGV’s Vyooham Movie: ఆర్జీవి ‘వ్యూహం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌కు రెడీ..!

కాగా ఈ మూవీని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగాన్ని ‘వ్యూహం’ గానూ, రెండవ భాగాన్ని ‘శపథం’గానూ తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. దీంతో ఈ మూవీకి కోర్టులో గ్రీన్ సిగ్నల్ పడటంతో ఈ మూవీ రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 16న రిలీజ్ చేసే అవకాశమున్నట్లు టాక్ వినిపించింది. అందరూ ఈ తేదీనే రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఆ తేదీ కాదు. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై దర్శకుడు ఆర్జీవీ తాజాగా తన ఇన్‌స్టాలో చెప్పుకొచ్చాడు. ‘వ్యూహం’ పేరుతో రిలీజ్ కాబోతున్న సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా సెకండ్ పార్ట్ ‘శపథం’ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించాడు. ఈ సెకండ్ పార్టును మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. దీంతో ఈ మూవీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

READ MORE: Vyuham Movie : “వ్యూహం” విడుదలపై ఉత్కంఠ.. లైన్ క్లియర్ అవుతుందా ?

కాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు ఈ వ్యూహం మూవీ ఉండనుంది. ఈ వ్యూహం మూవీలో వైఎస్ జగన్ పాత్రలో నటుడు అజ్మల్ నటించగా.. వైఎస్ భారతి పాత్రలో మానస నటించారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×