E-Paper
Advertisement

Game Changer: పెద్ద మనసు చాటుకున్న రామ్ చరణ్.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..!

Game Changer: పెద్ద మనసు చాటుకున్న రామ్ చరణ్.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..!
Advertisement

Game Changer:ఇటీవల జనవరి 4వ తేదీన రాజమండ్రిలో ఉన్న ఒక ఓపెన్ గ్రౌండ్లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా అభిమానులు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం విచ్చేశారు. ఇకపోతే ఈ సినిమా హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani) కూడా వస్తుందనుకున్నారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ప్రమోషన్స్ కి హాజరు కాలేదు. ఇక తర్వాత అంజలి(Anjali )కూడా తన వంతు అడుగు వేసి ప్రమోషన్స్ లో భాగమైంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాజకీయాలలో అధికారం చేపట్టిన తర్వాత , ఈయన హాజరైన తొలి ఈవెంట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాత అభిమానులు ఇంటికి చేరుకునే క్రమంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారు . ఇక వారికి దిల్ రాజు , పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా శనివారం రోజు రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అని ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. వాళ్ళిద్దరూ ఈవెంట్ తర్వాత బైక్ మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఇక దీంతో అభిమానుల మృతి పై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఎక్స్గ్రేషియా ప్రకటించిన హీరో..

Advertisement

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన సన్నిహితులను, తన మనుషులను పంపించి ధైర్యం కూడా చెప్పించారు రామ్ చరణ్. కుటుంబాలకు చెరొక రూ .5లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. దీనిపై రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాము. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా కోరుకునేది అదే. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధపడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అంటూ తెలిపారు రామ్ చరణ్. ఇకపోతే ఇప్పటికే చిత్ర నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరొక రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×