E-Paper
Advertisement

K.Viswanath : కె. విశ్వనాథ్ కు ప్రముఖుల నివాళి..

K.Viswanath : కె. విశ్వనాథ్ కు ప్రముఖుల నివాళి..
Advertisement

K.Viswanath : కె. విశ్వనాథ్ మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ శోకచంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.

తెలుగు సినిమాకే గర్వకారణం: బాలకృష్ణ
కళాతపస్వి కె.విశ్వనాథ్ క‌న్నుమూయ‌డం తెలుగు చ‌ల‌న‌చిత్ర పరిశ్రమకు తీర‌ని లోటని బాలకృష్ణ అన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు ముఖ్యంగా తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణంగా నిలిచాయన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురిచేసిందని పేర్కొన్నారు. క‌ళా త‌ప‌స్వి ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుడిని ప్రార్థించారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సంతాపం తెలియ‌జేశారు.

Advertisement

పవన్‌ కల్యాణ్‌ నివాళి
దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ భౌతికకాయానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు. త్రివిక్రమ్‌, సత్యానంద్‌లతో కలిసి విశ్వనాథ్ పార్థివదేహం వద్దకు వచ్చారు. శంకరాభరణం సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసిందన్నారు. కె.విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఎప్పటికి అభిమానినే: కమల్‌హాసన్‌
కళ గొప్పతనాన్ని పూర్తి అర్థం చేసుకున్న వ్యక్తి కె.విశ్వనాథ్‌ అని కమల్ హాసన్ అన్నారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ కళాతపస్వికి అభిమానినే అని అన్నారు.

Advertisement

స్వర్ణకమలం విశ్వనాథ్ : బ్రహ్మానందం

పుట్టిన ప్రతి వాడూ చనిపోకతప్పదని బ్రహ్మానందం అన్నారు. కానీ అద్భుతమైన మరణాన్ని పొందిన కె.విశ్వనాథ్‌ కళ బతికున్నంత కాలం మనతోనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తాను రెండు సినిమాల్లో నటించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహనీయుడు మన మధ్య లేరంటే బాధగా ఉందన్నారు. భారత చలన చిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం కె. విశ్వనాథ్ అని బ్రహ్మానందం అన్నారు.

భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయింది: గవర్నర్‌ తమిళిసై

కె. విశ్వనాథ్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయిందని తమిళిసై ట్వీట్ చేశారు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి క్లాసిక్‌ చిత్రాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం : వెంకయ్యనాయుడు
కె. విశ్వనాథ్ మరణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×