E-Paper
Advertisement

Filim Chanber : కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం..దీనిపైనే చర్చ.

Filim Chanber : కొండా సురేఖ వ్యాఖ్యల పై ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం..దీనిపైనే చర్చ.
Advertisement

Filim Chamber : టాలీవుడ్ హీరోయిన్ సమంత విడాకుల పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.. ఆమె క్షమాపణలు చెప్పిన కూడా ఫిలిం ఇండస్ట్రీలోని ప్రముఖులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ లబ్ది కోసం సినిమా వాళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చెయ్యొద్దనే వాదన వినిపిస్తున్నారు. టాలీవుడ్ లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. తాజాగా ఈ విషయం పై ఈరోజు మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ లో అత్యవసర మీడియా సమావేశన్ని ఏర్పాటు చేశారు సినీ పెద్దలు. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని సహా పలువురు నటీనటులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఫిలిం ఛాంబర్ ఈ విషయం పై ఒక ప్రెస్ ను నోట్ ను రిలీజ్ చేశారు ప్రస్తుతం ఆ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫిలిం ఛాంబర్ ప్రెస్ నోట్ లో ఏముందంటే?

Advertisement

మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణం అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయాల్లోను తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా దీనిపై ఫిలిం ఛాంబర్ లో అత్యవసర సమావేశన్ని ఏర్పాటు చేశారు. సినీ పెద్దలు దీని పై క్షుణ్ణంగా చర్చించి ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఆ నోట్ లో.. రాజకీయాలతో సినిమాలను ముడిపెట్టకండి.. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం సినీ ప్రముఖుల పై చిన్న చూపు చూస్తుంది. మీడియాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు వినిపిస్తున్నాయి. మీ రాజకీయ లబ్ది కోసం కేవలం సినిమా వాళ్ల వ్యక్తి గత విషయాలను తీస్తూ మాట్లాడం మంచిది కాదు.. మీరు మాట్లాడే మాటలు జనాలకు వేరేలా అర్థమవుతున్నాయి. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ మతపరమైన వివక్ష లేకుండా ఒక లౌకిక సంస్థగా ముందంజలో ఉంది. మా సోదరభావం అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది.. ఇలాంటి వాటికి ఫిలిం ఛాంబర్ వ్యతిరేకంగా ఉంటుంది. భవిష్యత్తులో సభ్యులకు అండగా నిలుస్తుంది. బలమైన తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదు అంటూ నోట్ లో రాసుకొచ్చారు..

ఈ వివాదం పై ఇప్పటికే సినీ లోకం గళం విప్పింది.. ఇండస్ట్రీలోని ప్రముఖులు దీనిపై ఖండిస్తున్నారు. మంత్రి కొండా సురేఖపై మూకుమ్మడి దాడిని సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఇక తాజాగా నాగార్జున షాకిచ్చారు. తన పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదం ఇక ఎంత వరకు వెళ్తుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×