E-Paper
Advertisement

Tollywood Heroine : పెళ్లి రోజునే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..

Tollywood Heroine : పెళ్లి రోజునే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..
Advertisement

Tollywood Heroine : తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్ల బాట పట్టారు. కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకొని తల్లి తల్లిదండ్రులు అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు గానీ తర్వాత మళ్లీ తమ కెరియర్ వైపు ఫోకస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పటికే కాజల్ అగర్వాల్ ప్రణీత సుభాష్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ లోని ఓ హీరోయిన్ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆమె ఎవరో కాదు.. నాచురల్ స్టార్ నాని నటించిన పిల్ల జమిందార్ హీరోయిన్ హరిప్రియ. ఇటీవల ఆమె సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఓ పన్నంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది..

ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు వశిష్ట సింహ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దాంతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న హరిప్రియ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైందని తెలిసిందే. నటుడు వశిష్టతో ఆమె పెళ్లి జరిగిన తర్వాత ఆమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. గర్భం ధరించగానే షూటింగులకు దూరం అయ్యింది. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది.. రీసెంట్ ఆమె సీమంతం ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇక ఆదివారం హరిప్రియ, వశిష్ట లు తల్లి దండ్రులు అయ్యారు.. దంపతులకు కుటుంబ సభ్యులు, బంధువులు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

ఇకపోతే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ దంపతులు తమ పెళ్లి రోజే తల్లి దండ్రులు అయ్యారు. ఈ జంట 2023 జనవరి 26న వివాహం చేసుకున్నారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అంటే జనవరి 26, 2025న పండంటి బిడ్డ మా మధ్యలోకి వచ్చాడని వశిష్ట పోస్ట్ చేసిన పేర్కొన్నాడు. ఈ కన్నడ జంట వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హరిప్రియ మాత్రం గర్భం దాల్చిన తర్వాత సినిమాలకు కంప్లీట్ గా దూరమయ్యారు. ఇక వశిష్ఠ మాత్రం తెలుగు కన్నడ చిత్రాల్లో పలు కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. హరిప్రియ తెలుగులో నాని పిల్ల జమీందార్ తో పాటు వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా మూవీల్లో నటించింది. అంతేకాదు చివరగా నందమూరి హీరో బాలయ్య నటించిన జై సింహా సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది.. ఈమధ్య సినిమా హీరోయిన్లు పిల్లలు కలిగిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నారు. మరి హరిప్రియ కూడా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందేమో చూడాలి..

 

View this post on Instagram

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×