E-Paper
Advertisement

Jayasudha: ఆ హీరో డంపింగ్ యార్డ్ కొనమన్నాడు.. పిచ్చా అనుకున్నా.. ఇప్పుడు దాని విలువ రూ. 100 కోట్లు

Jayasudha: ఆ హీరో డంపింగ్ యార్డ్ కొనమన్నాడు.. పిచ్చా అనుకున్నా.. ఇప్పుడు దాని విలువ రూ. 100 కోట్లు
Advertisement

Jayasudha: సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ  హీరోలుగా కొనసాగుతున్న సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి వారి తరువాత  అంతటి గుర్తింపును తెచ్చుకున్న హీరో శోభన్ బాబు.  ఇక హీరోగానే ప్రేక్షకుల మదిలో ఉండిపోవాలని.. మళ్లీ రీఎంట్రీ కూడా ఇవ్వకుండా అలానే చనిపోయారు. అందుకే ఆయన గురించి అంత గొప్పగా చెప్పుకొస్తారు.

సినిమాల విషయం పక్కన పెడితే.. శోభన్ బాబు డబ్బును వృథాగా ఖర్చుపెట్టే వ్యక్తి కాదు. ఇప్పటికీ ఆయన కొడుకులు ఇండస్ట్రీలో లేకుండా ధనవంతులుగా జీవిస్తున్నారు అంటే.. అది శోభన్ బాబు పెట్టిన పెట్టుబడుల వలనే.  ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో ఆయనది అందెవేసిన చెయ్యి. ఎన్టీఆర్, ఏయన్నార్ లకు కూడా రియల్ ఎస్టేట్ విషయంలో శోభన్ బాబు సలహాలు తీసుకొనేవారంటే అతిశయోక్తి కాదు.

Advertisement

కొద్దిగా డబ్బు ఉన్నా కూడా ఒక స్థలం కోనేసేవాడట. ఆయన కొనడమే కాకుండా తనతో నటించవారికి కూడా సలహాలు ఇచ్చేవారట. ఈ విషయాన్నీ చాలామంది సీనియర్ నటులు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అప్పట్లో శోభన్ బాబు గారు ఆ స్థలం కొనమంటే కొనలేదు. ఆయన మాట వింటే బావుండేది అని ఎంతోమంది చెప్పుకొచ్చారు. అలా చెప్పినవారిలో జయసుధ కూడా ఒకరు.

సహజనటిగా పేరు తెచ్చుకున్న  ఆమె.. శోభన్ బాబుతో ఎన్నో సినిమాల్లో నటించింది. వారిద్దరిది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక ఒక ఇంటర్వ్యూలో జయసుధ.. శోభన్ బాబు చెప్పిన మాట వినలేదని చెప్పుకొచ్చింది. ఒక డంపింగ్ యార్డ్ కొనమంటే తాను కొనలేదని, అప్పుడు అది కొని ఉంటే తాను నెక్స్ట్ లెవెల్ లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. ” ఒకసారి మేము షూటింగ్ కు వెళ్ళినప్పుడు.. ఇద్దరం కారులో వస్తున్నాం. వచ్చేటప్పుడు  ఏమోయ్.. నన్ను ఆయన అలానే పిలుస్తారు.

Advertisement

Indraja: జబర్దస్త్‌ అడల్ట్ కామెడీ కోసమే చూస్తున్నారు.. నాపై కూడా వల్గర్ కామెంట్స్..

ఏమోయ్.. నీకు నేనొక స్థలం చూపిస్తాను.. మీ నాన్నగారికి చెప్పి దాన్ని నువ్వు కొను అన్నారు. తరువాత మా ఆయన నితిన్ తో కలిసి వెళ్లి చూస్తే అది డంపింగ్ యార్డ్. అది చూసి.. ఈయనేకమైనా పిచ్చా ఏంటి.. డంపింగ్ యార్డ్ చూపించి  కొనమంటున్నాడు. నీకు తెలియదు.. ఇక్కడ ఇదంతా ఎందుకు డంప్ చేస్తున్నారు అంటే.. ఇక్కడ చదును చేసి మంచి ప్లేస్ చేస్తారు అని చెప్పారు. అయినా  నేను కొనలేదు.

అది ఇవాళ చెన్నైలోని అన్నానగర్ ఏరియాగా మారింది. ఇప్పుడు అది ఎన్ని కోట్లంటే ఏం చెప్తాము.. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం.. రూ.100 కోట్లు ఉంది. అలాంటివి  చాలా ఉన్నాయి. అప్పుడు శోభన్ బాబు గారు చెప్పినవి మేము వినలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి అని కొందరు. శోభన్ బాబు  మంచి ఫైనాన్షియల్ ప్లానర్.. ఆయన ఏది చేసినా ఆచితూచి చేస్తారు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×