E-Paper
Advertisement

M M Keeravani : 35 ఏళ్ల కల ఇప్పుడు తీరింది… ఇళయరాజాకు థాంక్యూ అంటున్న ఆస్కార్ విన్నర్

M M Keeravani : 35 ఏళ్ల కల ఇప్పుడు తీరింది… ఇళయరాజాకు థాంక్యూ అంటున్న ఆస్కార్ విన్నర్
Advertisement

M M Keeravani : ఆస్కార్‌ విజేత ఎం.ఎం..కీరవాణి (MM Keeravani) గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని.. తెలుగు వారిని గర్వపడేలా చేశారు. అయితే.. ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో, అంత మంచి గాయకుడు కూడా. అంతే కాదు… ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. చాలా సినిమాల్లో పాటలు రాశారు. దాదాపుగా అరవైకి పైగా పాటలు రాశారు. కానీ తొలిసారి ఆయన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) బాణీకి పాట రాశారు.

షష్టిపూర్తి కోసం కీరవాణి

Advertisement

రూపేశ్, ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా షష్టిపూర్తి (Shashtipoorthi) అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అర్చన కూడా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఫ్యామిలీ మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటను ఎం.ఎం..కీరవాణి రచించారు. సినిమాలో ఓ ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే పాటకి కీరవాణి సాహిత్యం అందిస్తే బాగుంటుందని ఆయనతో ఈ పాట రాయించారు.అనన్య భట్ ఆలపించిన ఈ పాటకు ఇళయరాజా బాణీ, కీరవాణి సాహిత్యం అందించడం స్పెషాల్టీగా నిలిచింది. ఈ సందర్భంగా కీరవాణి థ్యాంక్యూ చెబుతూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

అరుదైన అవకాశం

Advertisement

నేను ఫస్ట్ మద్రాస్ వెళ్లింది ప్లే బ్యాక్ సింగర్ అవుదామని.. కాకపోతే అది ఎంత కష్టమో ఆ తర్వాత తెలిసింది. తర్వాత మెల్లి మెల్లిగా సంగీత దర్శకుడిగా స్థిరపడ్డాను. అయితే.. నేను ప్లే బ్యాక్ సింగ్ అవాలని కలలు కనే రోజుల్లో.. ముఖ్యంగా ఇళయారాజా సంగీత దర్శకత్వంలో పాడాలని ఉండేది. ఆ కోరిక ఇప్పుడు ఇండైరెక్ట్‌గా నెరవేరింది. షష్టిపూర్తి అనే సినిమాను తెలుగులో డబ్ చేయగా.. అందులో నేను పాడడం జరిగింది. ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌కి, ఆయన ట్యూన్‌కి లిరిక్స్ రాసే అవకాశం నాకు లభించింది. షష్టిపూర్తి ద్వారా కలిగిన ఈ అవకాశాన్ని నాకు దక్కిన అరుదైన అవకాశాల్లో ఒకటిగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌గాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని చెప్పుకొచ్చారు. 35 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరిగిందని అన్నారు.

SSMB29 లాంటి సినిమా రాలేదు

ఇక.. ప్రస్తుతం కీరవాణి సంగీతం అందిస్తున్న సినిమాలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా గురించి కీరవాణి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇది అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలకు కీరవాణినే సంగీతం అందిస్తు స్తున్నారు. ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎంబీ 29కి సంగీతం అందిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వడం లేదు.  షూటింగ్ మాత్రం శరవేగంగా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కోసం స్పెషల్‌గా ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు.  మరి కీరవాణి ఈసారి తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×