E-Paper
Advertisement

Manchu Manoj: జీవితాంతం మీకు రుణపడి ఉంటా… కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్!

Manchu Manoj: జీవితాంతం మీకు రుణపడి ఉంటా… కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్!

Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భైరవం(Bhairavam). ఎన్నో అంచనాల నడుమ నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కనకమెడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు మనోజ్ తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నటించారు. అయితే ఈ ముగ్గురు హీరోలు గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే కాకుండా ఎలాంటి సక్సెస్ లేక ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారు. ఈ సినిమా ద్వారా ఈ ముగ్గురు హీరోలు ఒకేసారి స్క్రీన్ పై కనిపించి సందడి చేశారు. నేడు విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.

డైరెక్టర్ కు రుణపడి ఉంటా…

ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ముందుగా భైరవం సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అని తెలియజేశారు. ముఖ్యంగా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మీ రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. దాదాపు 9 సంవత్సరాలు తర్వాత తాను వెండితెరపై కనిపించానని మనోజ్ తెలిపారు. ఇన్ని
సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నన్ను అంతే ప్రేమతో ఆదరించారని ఈయన ఎమోషనల్ అయ్యారు.

సక్సెస్ సెలబ్రేషన్స్…

ఇలా మా భైరవం సినిమాను మంచి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సంతోషంలో తాను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు సక్సెస్ మీట్ కార్యక్రమంలో మరిన్ని విషయాలను మీతో పంచుకుంటానని అయితే రేపటి నుంచి మేము ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీ ఊర్లకు వస్తామని , ముగ్గురం ఒక్కొక్కరు ఒక్కవైపు వెళ్లి సినిమాని మరింత ప్రేక్షకులలోకి తీసుకువెళ్తామని మనోజ్ తెలిపారు. మొత్తానికి భైరవం సినిమా ద్వారా మనోజ్ చాలా సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు.

మనోజ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈయన తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇక భైరవం సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం గరుడన్ సినిమాకు రీమేక్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు భాషలోకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చిత్ర బృందం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక మంచు మనోజ్ తో పాటు నారా రోహిత్, సాయి శ్రీనివాస్ కూడా ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

 

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×