
Miss India Winners : అందాల పోటీల్లో కిరీటం అందుకున్న ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారడం కొత్తేమీకాదు. ఇప్పటికే అలా ఎంతోమంది సందడి చేయగా.. మరికొందరు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.వాళ్లెవరంటే?
గాయత్రీ భరద్వాజ్..
2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ ఇండియా కిరీటం అందుకుంది. ఢిల్లీకి చెందిన ఈమె హిందీ చిత్రం ‘ఇత్తు సి బాత్’తో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. రవితేజ సరసన నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’లో కూడా తన నటనతో మెప్పించింది.
అనుక్రీతి వాస్..
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2018 విన్నర్ అనుక్రీతి వాస్. తమిళనాడుకు చెందిన ఈమె తమిళ చిత్రం ‘డీఎస్పీ’తో హీరోయిన్గా మారింది. అనుక్రీతి వాస్ కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో సందడి చేసిన విషయం తెలిసిందే.
మానుషి చిల్లర్..
2017లో నిర్వహించిన పోటీల్లో ‘మిస్ ఇండియా’, ‘మిస్ వరల్డ్’గా నిలిచింది. హరియాణాకు చెందిన ఈమె ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ (హిందీ)తో నటిగా మారింది. వరుణ్ తేజ్తో కలిసి నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ డిసెంబర్ 8న విడుదల కానుంది.
మానస వారణాసి..
ఫెమినా మిస్ ఇండియా-2020 విన్నర్. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాతో ఈమె హీరోయిన్గా పరిచయం కానుంది. మానస వారణాసి మన హైదరాబాద్ తెలుగు అమ్మాయి కావడం విశేషం.
Asha: ఆ నిర్మాత వేధింపులు తట్టుకోలేక పారిపోయా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్