E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్ మంచి మనసు.. ఆ సినిమాకు రెమ్యూనరేషన్ తగ్గింపు?

Prabhas: ప్రభాస్ మంచి మనసు.. ఆ సినిమాకు రెమ్యూనరేషన్ తగ్గింపు?
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.

 

Advertisement

ఇక మొట్టమొదటిసారి ప్రభాస్ రాజాసాబ్ లో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్  తాత మనవడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఎన్నో వాయిదాల తరువాత చివరకు రాజాసాబ్  డిసెంబర్ 5న  రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే గత కొన్నేళ్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు అయినా కూడా ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు పరాజయాన్ని చవిచూస్తూనే ఉన్నాయి.

 

Advertisement

ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆశలన్నీ రాజా సాబ్ సినిమా మీదనే పెట్టుకుంది అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ సినిమా అంటే బిజినెస్ కూడా బాగా గట్టిగానే జరుగుతుంది. ఈనెల 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది. టీజర్ చూశాక ఆ బిజినెస్ లెక్కలు మారొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారుతుంది.  తాజాగా  ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ రాజాసాబ్ కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ రేంజ్ మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక కల్కి తర్వాత డార్లింగ్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజాసాబ్ కు మాత్రం డార్లింగ్ రూ. 50 కోట్లు తగ్గించుకొని  రూ. 100 కోట్లు మాత్రమే తీసుకున్నాడని టాక్ నడుస్తుంది.

 

అయితే రాజా సాబ్ సినిమాకు మాత్రమే ఎందుకు పారితోషికం తగ్గించాడు అనేదానికి కారణం కూడా ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఆదిపురుష్ సినిమాతో జరిగిన విషయం తెలిసిందే.  ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది.  ఇక ఈ సినిమాను తెలుగు హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే కొనుగోలు చేసి రిలీజ్ చేసింది. దీనివల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా నష్టపోయింది.  దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత విశ్వప్రసాద్ కు కొద్దిగా భారాన్ని తగ్గించడానికి ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ ఫాన్స్  ఆయన మంచి మనసుని ప్రశంసిస్తున్నారు. మరి ఈ సినిమాతో డార్లింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×