Nandamuri Mokshagna : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. నందమూరి నట సింహం బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఓ వార్త షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హనుమాన్ మూవీతో యావత్ సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అందరు అనుకున్నారు. ఇక ఈ మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మూవీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.. అసలు కారణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానుల సంతోషానికి అవధలు లేవనే చెప్పాలి. అంతేకాదు ఫస్ట్ లుక్ ని మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా ఉన్నటువంటి నందమూరి వారసుడిని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ఈ చిత్రానికి ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇది నిన్న మొన్నటి వార్త. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు ఫిలిం నగర్ లో ఓ వార్త షికారు చేస్తుంది.. అదేంటి రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు వెళ్లిపోవడం ఏంటి అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..
బాలయ్య, ప్రశాంత్ వర్మ మధ్య గొడవలా..?
ఫస్ట్ డైరెక్షన్ చేస్తా అన్నాడు. భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కానీ, ఇప్పుడు ఓన్లీ కథ మాత్రమే ఇస్తా… నా అసిస్టెంట్ తో డైరెక్షన్ చేయిస్తా అని చెబుతున్నాడు.. ఇక భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా అనడంతో బాలయ్యకు కోపం వచ్చేసింది. దాంతో ఆయన్ను తప్పించాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. చిత్రంలో మోక్షజ్ఞతో పాటు బాలయ్య కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మహాభారతం క్యారెక్టర్స్ ని లింక్ చేస్తూ ఈ చిత్రం స్టోరీ ఉంటుందట. అలా ఆసక్తికరమైన కథని సిద్ధం చేసిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు అంటూ వార్తలు రావడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.. ఇక డెబ్యూ మూవీ ఇప్పుడు ఆదిత్య 999 కదా దానికి డైరెక్టర్ బాలయ్య కాబట్టి… బాలయ్య సినిమాలు, పొలిటికల్ గా బిజీ గా ఉంటాడు. దీని వల్ల సినిమా చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే వారసుడి ఏంట్రీ లేట్ అయింది. బాలయ్య చేతిలో పడటంతో మరింత లేట్ అవుతుంది… మరి ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను లాంచ్ చేస్తారో చూడాలి.. ఏది ఏమైనా మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ వల్లే జరిగింది అని అతన్ని తిడుతున్నారు. ఈ మూవీ మధ్యలో ఆగిపోవడానికి కారణం కూడా లేక పోలేదు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ భారీ ప్రాజెక్టు లను తన చేతిలో పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీ లేట్ అవుతుందని చెప్పాడు.